కేంద్రంలో బీజేపి అధికారంలోకి వచ్చాక, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాస్తా స్థబ్దుగా వున్న ఇండియన్ ముజాహిద్దీన్ మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత ఆరు మాసాలుగా ఎలాంటి తీవ్రవాద దాడులు లేకుండా ప్రశాంతంగా వున్న దేశంలో మరోమారు అలజడి సృష్టించేందుకు వారు పూనుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో తాము దాడులు జరుపుతామని పేర్కొంటూ వారు రాజస్థాన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తూ.. ఈ మెయిల్స్ ను పంపారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రాజస్థాన్ లో దాడులు చేస్తామని ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఈ మేరకు 10 మంది రాజస్థాన్ మంత్రులతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలకు చెందిన అధికారిక మెయిళ్లకు వారు హెచ్చరికలు పంపారు. జనవరి 26న తప్పనిసరిగా దాడులు చేసి తీరుతామని ఆ సందేశాల్లో ఉగ్రవాదులు హెచ్చరించారు. క్యాబినెట్ మంత్రులకు నేరుగా హెచ్చరికల జారీ చేస్తూ వచ్చిన ఈ మెయిళ్లపై పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మెసేజ్ లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని కనుగొనే పనిలో పోలీసుల సైబర్ వింగ్ నిమగ్నమైంది.
రాజస్థాన్ లో పలువురు మంత్రులకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని.. మంత్రుల అధికారికి మెయిల్ ఐడీలకు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయని రాజస్థాన్ డీజీపీ ఒమేంద్ర భరద్వాజ్ తెలిపారు. 'మేము ఏం చేస్తామో మీరు అర్థం చేసుకోండి' అంటూ ఉగ్రవాదులు మెయిల్ లో పేర్కొన్నారు. అయితే ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో రాజస్థాన్ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో వాహనాల తనిఖీలను ప్రారంభించారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనబడితే.. తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more