23 dead in peshawar school attack taliban militant blows himself up

Terrorism-related Incidents, terrorism, terrorism in pakistan, terrorism in peshawar, peshawar recent incident

Another incident took place in Peshawar.., 23 dead in Peshawar school attack, Taliban militant blows himself up

పాకిస్తాన్ లో మారణహోమం

Posted: 12/16/2014 02:47 PM IST
23 dead in peshawar school attack taliban militant blows himself up

ప్రపంచమంతా ఉగ్రవాద చర్యలతో అట్టుడికిపోతుంది నిన్న ఆస్ట్రేలియా లో ఉగ్రవాద సంఘటన జరిగి 24 గడవకముందే ఉగ్రవాదులు మరోసారి తమ కర్కశత్వాన్ని చూపెట్టారు. పాకిస్తాన్ లోని పేషావర్ నగరంలో ఆర్మీ స్కూల్లో  తెహరీక్- ఎ- తాలిబన్- పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రవాద సంస్థ దారుణమైన ఘాతుకానికి పాల్పడింది, 100 మంది పిల్లలలను అతి దారుణంగా చంపారు. పాటశాలపై దాడికి దిగిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. 100 మంది వరకు పిల్లలు చనిపోయినట్లు సమాచారం. మరో 45 మందికి తీవ్ర గాయలయినట్లు తెలుస్తుంది. అయితే తాము పెద్ద పిల్లలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని, పిల్లలను వదిలేయాలని సూచించామని ఆ ఉగ్రవాద సంస్థ తెలిపింది. సుమారు 500 మందికి పైగా విద్యార్థులతో పాటు అక్కడున్న ఉపాధ్యాయులు కూడా ఉగ్రవాదుల చెరలో ఉన్నారు.

కేవలం ఆరుగురు ఉగ్రవాదులే అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి సుమారు 105 మంది పిల్లలను ఉగ్రవాదులు హతమార్చారు. ఇది కేవలం ప్రతీకార చర్య అని, ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో సైనిక చర్యకు ప్రతీకారంగానే ఇలా చేశామని టీటీపీ నేతలు చెప్పారు. దాడికి పాల్పడిన వాళ్లు ఎవరైనా సహించేది లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు.ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భద్రత దళాలు వెంటనే స్పందించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులకు తెర లేచింది. పాటశాల లోని 500 మంది పిల్లలను బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. పాకిస్తాన్ లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. భద్రత దళాలు ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షిస్తున్నాయి.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles