ముగ్గురు పోకిరీలు.. వెకిలి చేష్టలు.. సూటిపోటి మాటలు.. అయినా బెదరకుండా వారి ఆటలు మొక్కవోని ధైర్యసాహాసాలతో కటించిన సాహస అక్కాచెల్లెళ్లకు అరుదైన గౌరవం దక్కనుంది! ఆ యువతులకు సాహస రివా ర్డు దక్కనుంది. గణతంత్ర దినోత్సవాన ఆ అక్కాచెల్లెళ్లు ఆర్తీ కుమార్(22), పూజ(19)లకు నగదు బహుమతిని అందించి సత్కారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నిర్ణయించారు. రోహ్టక్కు చెందిన వారు బస్సులో వెళుతుండగా ముగ్గురు యువకులు వేధించి.. వారి చేతిలో చావుదెబ్బలు తిన్నారు. కాగా, ప్రయణికులకు, ప్రత్యేకించి మహిళల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీ, రోడ్డు రవాణా సంస్థను హర్యానా ప్రభుత్వం ఆదేశించింది.
సంఘటన అనంతరం పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన ఆ ముగ్గురు యువకులు కుల్దీప్, మోహిత్, దీపక్ను అరెస్టు చేశారు. యువతులను వేదించిన పోకిరీలకు డిసెంబర్ 6 వరకు కోర్టు జుడిషియల్ కస్టడీ విధించింది. అయితే కేసుకు న్యాయబద్ధమైన ముగింపు పలికేందుకు ఆ సంఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు, బస్సులోని మిగతా ప్రయాణికులు దర్యాప్తునకు సహకరించాలని జిల్లా ఎస్పీ శషాంక్ ఆనంద్ కోరారు. కాగా, నిందితులపై పెట్టిన కేసును వాపసు తీసుకోవాలంటూ తమ తండ్రిని కొందరు బెదిరించారని ఆర్తీ ఆరోపించారు.
మరోవైపు, ముగ్గురు యువకులు కుల్దీప్, మోహిత్, దీపక్ను పోలీసులు అరెస్టు చేయడంతో వారి గ్రామస్థులు అల్టిమేటం జారీ చేశారు. వారిని 24 గంటల్లో విడిచిపెట్టకపోతే రోడ్లన్నింటినీ దిగ్బంధం చేస్తామని కన్ల్సా గ్రామస్థులు జిల్లా పరిపాలన విభాగం, ఎస్పీకి అల్టిమేటం ఇచ్చారు. ఆ అమ్మాయిలను తమ పిల్లలు వేధించలేదని, కేవలం సీట్ల విషయంలో గొడవ జరిగిందని వివరించారు. అయితే ఎవరైనా అలాంటి కార్యకలాపాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని ఎస్పీ హెచ్చరించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more