కేబీఆర్ పార్క్ కాల్పుల కేసులో నిందితుడు కానిస్టేబుల్ పులి ఓబులేశేనని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు తెగబడింది ఓబులేశేనని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. అతనొక్కడే ఈ నేరం చేశాడని చెప్పారు. బెల్ ఫామ్(తుపాకులను శుభ్రం చేసే చోటు) నుంచి ఎత్తుకుపోయిన ఏకే 47 రైఫిల్, లోడెడ్ మేగజీన్ తో అతడీ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు.
కడప జిల్లా కోరుమామిళ్ల మండలానికి చెందిన ఓబులేసు పోలీసు కానిస్టేబుల్ గా చేరాడని, తర్వాత గ్రేహౌండ్స్ కు మారాడని చెప్పారు. దొంగిలించిన ఆయుధాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో గుట్టల్లో దాచాడన్నారు. గత ఫిబ్రవరిలో కేబీఆర్ పార్క్ వద్ద ఒకరిని అపహరించి సఫలమయ్యాడన్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు వరకు తీసుకెళ్లి రూ.10 లక్షల వసూలు చేశాడని చెప్పారు. అయితే బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇది వెలుగులోకి రాలేదన్నారు.
నిత్యానంద రెడ్డిని కూడా కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడంతో దొరికిపోయాడని వివరించారు. కాల్పులు జరిగిన ఆరేడు గంటల్లోనే నిందితుడిని గుర్తించామన్నారు. కాల్పులు జరిపిన తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ వైపు పరిగెత్తిన నిందితుడు అమీర్ పేట్ కు చేరుకున్నాడని, అక్కడి నుంచి ఆటోల ఇమ్లిబన్ బస్టాండ్ కు వెళ్లి అక్కడి నుంచి బస్సులో కర్నూలు పారిపోయాడని చెప్పారు. 37 ఏళ్ల ఓబులేశుకు ఇంకా పెళ్లికాలేదని, విలాసాలకు అలవాటు పడి వక్రమార్గం పట్టాడని మహేందర్రెడ్డి తెలిపారు.
వీఐపీలను అపహరించి డబ్బు వసూలు చేసేందుకు ప్రణాళిక రచించాడన్నారు. ఖరీదైన కార్లు వున్నావారినే తాను కిడ్నాప్ కోసం ఎంచుకునే వాడని పోలీసులు తెలిపారు. ఓబులేశు గతంలో ఏపీఎస్పీ బెటాలియన్లో పనిచేశాడని, గ్రేహౌండ్స్లో 12 ఏళ్లపాటు పనిచేశాడని పోలీసులు తెలిపారు. సెలవులో ఉండి కూడా శుభ్రం చేస్తానన్న సాకుతో బెల్లా ఫామ్స్కు వచ్చాడని, ఫామ్స్ ఇన్ఛార్జికి తెలియకుండా ఓబులేశు వచ్చివెళ్లాడని పోలీసులు తెలిపారు. 2013 డిసెంబరులో ఏకే 47ను లోడెడ్ మ్యాగజీన్ను దొంగిలించాడన్నారు.
కిడ్నాప్ ప్లాన్ రచించేప్పుడు అతడు ఎవ్వరినీ తన వద్దకు రానిచ్చే వాడు కాదని చెప్పారు. అయితే తన వెనుక మరో ముగ్గురు వున్నారన్న కథనాలను పోలీస్ కమీషనర్ తోసిపుచ్చారు. ఓబులేశు ఒక్కడు మాత్రమే ప్రణాళికను రచించి అమలు పరుస్తాడని చెప్పారు. నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసే ముందు రోజు కేబీఆర్ పార్కు వద్ద రెక్కీ నిర్వహించాడని నగర పోలీస్ కమీషనర్ మహిందర్ రెడ్డి తెలిపారు
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more