విద్యుత్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల మద్య అగ్గి రాజేసిన విద్యుత్ షాకు చివరకు సామాన్యులకు తగిలేలా ఉంది. రెండు ప్రభుత్వాల మద్య జరుగుతున్న ఈ వివాదంలో ప్రజల ఇబ్బందులు పడతారేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాబు వైఖరికి వ్యతిరేకంగా మంగళవారం రోజు తెలంగాణలో ఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. ట్యాంక్ బండ్ పై జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సునీత, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ.... చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ఓ వైపు కరెంటు ఇస్తామని చెప్తూనే మరోవైపు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ఇస్తామని చెప్పే ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు నిలిపివేస్తుంది అని ప్రశ్నించారు. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. బాబు వైఖరి మారకుంటే తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల ఇళ్ళు, కార్యాలయాలకు పవర్ కట్ చేసేందుకు కూడా తాము వెనకాడమని హెచ్చరించారు. ఇలా రెండు ప్రభుత్వాల మద్య రాజుకున్న రగడ ఇప్పుడు ప్రజలకు ఇబ్బందులకు తీసుకువస్తుంది. ఏపీ ప్రభుత్వం వైఖరి మారక.., అటు తెలంగాణ రాష్ర్ట సమితి అన్నంత పనీ చేస్తే ఆంధ్రాప్రాంత ప్రజల ఇళ్ళలో దీపావళి వేళ చీకట్లే మిగులుతాయి.
అయితే ఇలా చేస్తే మాత్రం కోర్టులు జోక్యం చేసుకుని కారకులను శిక్షించటం ఖాయం. కాబట్టి ఇది కేవలం బెదిరింపే తప్ప.., నిజంగా జరిగే పని కాదు అని స్పష్టం అవుతోంది. అన్నదమ్ములుగా కలిసి ఉందామన్న రెండు ప్రభుత్వాలు ఇలా ఆస్తి తగాదాల మాదిరిగా నిత్యం కొట్టుకోవటం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more