తమిళనాట ‘అమ్మ’గా పిలవబడే జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టయి పరప్పణ సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఆమె జైలులో ఏం చేస్తున్నారు అనే విషయంపై ఆరా తీసిన వారికి ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అదేమంటే జైలులో జయలలిత అగర్ బత్తీలు తయారు చేస్తున్నారట. సాధారణంగా ప్రతి ఖైదీకి జైలు జీవితం సమయంలో ఏదో ఒక పని అప్పగిస్తుంటారు. ఇలా చేయటం వల్ల వారికి ఒంటరితనం నుంచి కాస్త ఉపశమనం లభిచటంతో పాటు.. జైలు నుంచి బయటకు వెళ్ళే సమయంలో చేతికి కొంత డబ్బు వచ్చి బయటకు వెళ్లగానే ఉపయోగపడుతుంది.
ఈ ప్రకారంగా అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న జయలలితకు కూడా జైలు అధికారులు పని అప్పగించాలని భావించారు. చెట్ల పెంపకం, పారిశుద్యం, కూరగాయలు కోయటం, సహా ఇతర పనులు జైలులో ఉంటాయి. అయితే ఆమె వయస్సు, ఆరోగ్య సమస్యల దృష్యా అగర్ బత్తీల తయారి అయితేనే బాగుటుంది అని భావించి పని అప్పగించారు. జైలు అధికారుల ఆదేశాల ప్రకారం జయమ్మ అగర్ బత్తీలు చేసుకుంటూ జైలు జీవితం గడుపుతోంది. ఈ పని వల్ల అమ్మకు డబ్బులు కూడా వస్తాయండోయ్.
‘అమ్మ సిమెంట్’, ‘అమ్మ క్యాంటీన్లు’ ఇలా అనేక సంక్షేమ పధకాలను జయలలిత ప్రారంభించారు. ఇవి రాష్ర్టంలో ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆ పేరు మీదగానే జయలలితను అంతా అమ్మ అని పిలుచుకుంటారు. కాగా ప్రస్తుతం జైలులో జయ అగర్ బత్తీలు తయారు చేస్తుండటంతొ వీటికి కూడా ‘అమ్మ అగర్ బత్తీలు’ అని పేరు పెడతారా ఏమిటి అని విమర్శకులు చమత్కరిస్తున్నారు. అయితే జైలులో తయారు చేసిన ఈ ఉత్పత్తులను వేరే పేరుతో అమ్మటం జరుగుతుంది. జైలులో తయారైన ఉత్పత్తులు నాణ్యమైనవి కావటంతో డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. గత నెల వరకు మహారాణిలా ఉన్న జయలలిత ఇప్పుడు సాధారణ ఖైదీగా జైలు జీవితం గడుపుతుండటం పట్ల అన్నా డీఎంకే నేతలు, కార్యకర్తలు, అమ్మ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more