ఆసియా ఖండంలో బాలల హక్కుల ఉద్యమకారుల సేవలను నోబుల్ బహుమతి అవార్డుల మండలి గుర్తించింది. బాలల హక్కుల కోసం శాంతియుత మార్గంలో ఉద్యమించిన కైలాష్ సత్యర్థిలకు ఈ ఏడాది నోబుల్ శాంతి బహుమతిని ప్రకటించారు.
భారత్ దేశంలో బాల కార్మికులను నిర్మూలించాలని, వారి హక్కుల కోసం గత 24 ఏళ్లుగా ఉద్యమిస్తున్న కైలాష్ సత్యర్థికి ఎట్టకేలకు ప్రపంచ గుర్తింపు దక్కింది. గాందేయ మార్గంలో శాంతియుతంగా బాలల హక్కుల కోసం ఉద్యమించారు. పలు విధాలుగా ఆందోళనలు , నిరసనలు చేసిన ఆయన కేవలం ధనార్జన కోసం పసిపిల్లలను కార్మికులుగా వాడుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక వేదికలపై ఆయన బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అంతర్జాతీయ వేదికలపై బాలల హక్కుల కోసం ఆయన చేసిన ప్రసంగాలు కూడా అంతర్జాయంగా ఉపకరించాయి. బచపన్ బచావో ఆందోళన్ పేరిట స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి.. బాలకార్మిక వ్యవస్థలో చిక్కుకున్న 80 వేల మంది బాల కార్మికులను ఆయన విడిపించారు.
అటు పాకిస్థాన్ బాలల హక్కుల పోరాట ఉద్యమకారిణి మలాలా యూసప్ జాయ్ కూడా బాలికల చదువుపై ఉధ్యమించింది. బాలికలు చదువులెందుకు అంటూ..? ప్రశ్నించి.. వారిని పాఠశాలకు పంపవద్దని ఆదేశించిన తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడి వారి తుపాకీ గుళ్లును ధీటుగా ఎదుర్కోన్న ధీర బాలిక. ప్రాణాపాయ స్థితి నుంచి మలాలా కోలుకోవాలని పాకిస్థాన్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు దేవుణ్ని ప్రార్థించారు. బాలికలు కూడా చదవుకోవాల్సిందేనంటూ ఉద్యమించారు. తన ధీరత్వంలో బాలికలకు విద్యాహక్కు అనే అంశంపై అధికార ప్రతినిధిగా ముందున్నారు
ఓ యువకుడుచ చిన్నారి,, ఓ హిందువుతో పాటు ఓ మహ్మదీయురాలు.. ఓ ఇండియన్.. ఓ పాకిస్థానీ అన్ని వేర్వేరు అయినా.. వారిరువురు కలసి ఒకే అంశంపై పోరాడటం ముదావహమని నోబుల్ బహుమతి అవార్డుల మండలి అభిప్రాయపడింది. 278 మంది బాలహక్కుల ఉద్యమకారుల నుంచి ఎంపిక చేశామని తెలిపింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more