మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ఇవాళే చివరి రోజు కావడంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు. హంగులు, ఆర్భాటాలకు దూరంగా తొలిసారిగా మహారాష్ట్ర ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియనుంది. బీజేపి, శివసేన, మహాయుతి పార్టీలతో పాటు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మధ్య పోత్తలు బెడిసికొట్టడంతో రాజకీయ పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగతున్నాయి. దీంతో అభ్యర్థుల ఖరారుకు రెండో రోజులు వుండడం, చివర క్షణంలో అభ్యర్థులను పార్టీలు ఖరారు చేయడంతో నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థులు పరుగులు తీస్తున్నారు.
మహారాష్ట్రలోని రెండు కూటములు విడిపోవడం.. రాజకీయ నేతలకు కలసి వచ్చింది. బీజేపి, శివసేనల పోత్తు, అటు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మద్య పోత్తుతో ఇన్నాళ్లు ప్రజాప్రతినిధులుగా అవకాశం కోసం ఎదురు చూసిన నేతలకు.. పోత్తులు బెటిసికోట్టడంతో ఇప్పడు అవకాశం వచ్చింది. దీంతో ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. ముందుగా ఆయా నియోజకవర్గాల నుంచి వారి నామినేషన్లను వేసేందుకు సిద్దం అవుతున్నారు.
పార్టీల బి-పామ్ లేకున్నా, పార్టీల నుంచి తమకు హామీలు లేకున్నా.. అధిక సంఖ్యలో ఆశావహులు నామినేషన్ల వేస్తున్నారు. చివరి క్షణంలో పార్టీలు తమకే టిక్కెట్ ను ఇవ్వవచ్చని ఆశిస్తున్న వారితో ప్రతీ నియోజకవర్గంలో 10 నుంచి 12 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. పార్టీ బీ-ఫాం దక్కని పక్షంలో తాము స్వతంత్రులుగా బరిలో నిలిచేందుకు కూడా వెనుకాడబోమని అభ్యర్థులు తేల్చిచెబుతున్నారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ సారి తాము స్థానం సంపాదించాలన్న యోచనతో అనేక మంది స్వతంత్రులుగా కూడా బరిలో నిలుస్తున్నారు.
అభ్యర్థుల నామినేషన్ల ఘట్టం కోసం అధికారులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముందుగానే పార్టీల వారీగా అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసే సమయాన్ని తెలుసుకుంటున్న అధికారులు .. వారికి వైరి పార్టీ ఎమ్మెల్యేలు ఎదురైన సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. ఇలా అన్ని పార్టీలూ వేటికవే విడివిడిగా పోటీ చేస్తుండంతో ఈసారి మహా ఎన్నికల సంగ్రామం ఎలా ఉంటుందోనన్న ఆసక్తిగా అందరిలోనూ నెలకొంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more