2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం చిచ్చు ఇంకా రగులుతూనే వుంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం దిగిపోయినా.. మాజీ ప్రధాని మన్మోహన్ చుట్టూ వివాదాలు చెలరేగుతూనే వున్నాయి. స్వయంగా 2జీ స్పెక్ట్రమ్ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజా అంతా ప్రధానికి తెలిసే జరిగిందని కోర్టులో వాంగ్మూలం ఇవ్వగా.. తాజాగా మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ కూడా అంతా ప్రధానికి తెలిసే జరిగిందని వ్యాఖ్యానించారు. 2జీ కుంభకోణం గురించి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు ముందే తెలుసునని స్కామ్ను ఆపే అవకాశం ఉన్నా మన్మోహన్సింగ్ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాజీ చీఫ్ వినోద్ రాయ్ మరో సంచలన విషయం బయట పెట్టారు. ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1.76 కోట్లు చిల్లు పెట్టిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం తనకు తెలియదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పడం పచ్చి అబద్దమన్నారు. ఈ కుంభకోణం గురించి ఆయనకు ముందుగానే తెలుసని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అప్పటి కేబినెట్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, కమల్నాధ్ టూజీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని హెచ్చరించినా, మన్మోహన్ సింగ్ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కమల్నాథ్ అయితే ఈ విషయంలో లేఖల ద్వారా పదే పదే హెచ్చరిచారని వినోద్ రాయ్ వెల్లడించారు. గట్టిగా వ్యవహరించి ఉంటే అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా చేసిన అడ్డగోలు టూజీ స్పెక్ట్రం కేటాయింపులను మన్మోహన్ సింగ్ ఆపగలిగేవారన్నారు. సంకీర్ణంలో నడుస్తున్న తన ప్రభుత్వాన్నికి ఎలాంటి విఘాతం కలగకూడదన్న ఒకే అంశంపై మన్మోహన్ సింగ్ 2జీ కుంభకోణాన్ని విషయంలో నిశ్చేష్టులుగా వున్నారని వినోద్ రాయ్ అన్నారు.
టూజీ, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాల్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు లేకుండా చూడాలని కాంగ్రె స్ నేతలు సంజయ్ నిరుపం, సందీప్ దీక్షిత్, అశ్వనీ కుమార్ తనపై ఒత్తిడి తెచ్చారని కూడా వినోద్ రాయ్ వెల్లడించారు. అయితే కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపం ఈ ఆరోపణలను ఖండించారు. రాయ్ ఆరోపణలు పచ్చి అబద్దమన్నారు. తానెపుడూ రాయ్ని కలవ లేదన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more