Jammu kashmir rescue operations going on

jammu kashmir, rescue operations, latest news, jammu rains, kashmir, jammu snow, india, pakisthan border, indian air force, army, defence, rescue operations, floods, rains

rescue operations in jammu kashmir is going on still lakhs of people on stranded : iaf, army doing rescue opetations in flood effected jammu kashmir death toll raises near 200

కల్లోల కాశ్మీరం.., సాయంకై లక్షల మంది ఎదురుచూపులు

Posted: 09/09/2014 12:16 PM IST
Jammu kashmir rescue operations going on

అందాల కాశ్మీరం కల్లోలంగా మారింది. పెను భీభత్సం సృష్టిస్తున్న వరదల ధాటికి లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సాయం కోసం ముంపు ప్రాంతాల్లో ఇంకా లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఆర్మీ, భారత వైమానిక దళం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినా.., ఇంకా చాలామంది వరదల్లో చిక్కుకున్నారు. వీరందర్నీ రక్షించేందుకు ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తోంది. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం ఆహార, నీళ్ళ ప్యాకెట్లను హెలికాప్టర్ల ద్వారా అందిస్తున్నారు. ప్రధానంగా శ్రీనగర్, దక్షిణ కాశ్మీర్ లోని ముంపు ప్రాంతాల్లో ఇంకా నాలుగు లక్షల మంది వరదల్లో చిక్కుకుని ఉంటారని ఆర్మీ భావిస్తోంది. వీరందర్నీ రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

ఆర్మీ, వైమానిక దళాలతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. అటు ఈ వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 200కు చేరువ అవుతోంది. వరదల భీభత్సానికి కొండచరియలు విరిగిపడటంతో ఎక్కువ మంది చనిపోయినట్లు అధికారులు చెప్తున్నారు. వీరిలో పలువురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జమ్మూలో వరదలు కాస్త తగ్గుముఖం పట్టాయని అధికారులు అంటున్నారు. ప్రవాహం తగ్గటంతో ఇప్పుడిక ప్రజలకు పునరావాస కేంద్రాల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరించామని చెప్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ రక్షించే వరకు సైనికులు క్యాంపులకు వెళ్లరని ఆర్మీ చీఫ్ దల్బీర్ సుహాగ్ తెలిపారు.

గడిచిన రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా వరదలు రావటంతో కాశ్మీర్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రధాన ఆదాయవనరైన టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. వరదల వల్ల రోడ్లు కోతకు గురయ్యాయి. కొన్నిచోట్ల ఏకంగా బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఇక సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. వందలాది గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. వీటన్నిటిని పునరుద్దరించటం కష్టంతో కూడుకున్న పని. కాశ్మీర్ విలయంను ఆదివారం ప్రత్యక్షంగా చూసిన ప్రధాని మోడి ఆదుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లను ప్రకటించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  floods  army rescue operations  latest news  

Other Articles