(Image source from: apngo president ashok babu questioning cm kcr)
ఒక్కనిముషం ఆగండి..! ఇక్కడ ఆరడుగుల బుల్లెట్ అంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాదు... విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రధాన ఉద్యమకారుడయిన ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు. అప్పట్లో ఈయన చేసిన వీరంగానికి సీమాంధ్ర ప్రజలు ఈయనకు ఆరడుగుల బుల్లెట్ గా పేరు పెట్టుకున్నారులెండి! ఇదీ అసలు సంగతి!
ఇక అసలు విషయానికి వస్తే.. కొన్నిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూములను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే! ఈ విషయంపై ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు.. ‘‘ఎన్నో దశాబ్దాలపాటు ఉద్యోగులకు కేటాయించిన భూమిని ప్రభుత్వం ఇలా అర్థంతరంగా వెనక్కు తీసుకోవడం మంచిది కాదని... ఇది ఎంతవరకు న్యాయమని’’ ఆయన వ్యాఖ్యనించారు. ఈ ఘటనపై తాము త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుస్తామని చెప్పిన ఆయన... తమకు కేటాయించిన భూముల్లో ఇళ్లనిర్మాణాలు ఎందుకు మొదలుపెట్టలేదో వివరిస్తామని పేర్కొన్నారు.
అలాగే ఏపీఎన్జీవోల ఆఫీసులో తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారని.. కానీ అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యోగుల మీద ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయంపై కేసీఆర్ ను ప్రశ్నిస్తానని ఆయన తెలిపారు. తెలంగాణాలో సీమాంధ్రలు నివసించడానికి సర్వాధికారాలు వున్నాయని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్రులపై వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాల్సిందిగా ఆయన కోరారు.
అయితే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సమైక్యవాది అయిన అశోక్ బాబును కలుసుకుంటారా..? ఒకవేళ కలుసుకుంటే... అశోక్ బాబు అభిప్రాయం మేరకు ఆయన తన వైఖరిని మార్చుకుంటారా..? దీనిమీద కేసీఆర్ ఎలా స్పందించనున్నారు..? ఏపీఎన్జీవోలకు ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు..? అనే అంశాలపై ప్రతిఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more