(Image source from: KTR Fires on PM narendra modi)
ఈమధ్యకాలంలో రాజకీయ వ్యవస్థలో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు శత్రువులుగా వున్నవారు ఒక్కసారిగా స్నేహితులుగా మారిపోతుంటే... మరోవైపు ఓడిపోయిన పార్టీల నాయకులు లెక్కలేకుండా ఇతరల పార్టీలవైపు వలసలు చేస్తున్నారు. ఒకరికొకరు దెమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రధాని స్థాయిలో వున్న నరేంద్రమోడీకి కూడా ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ... నరేంద్రమోడీ వ్యవహారంపై మండిపడుతోంది. ఆ పార్టీ నాయకుడు, ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి అయిన కేటీఆర్... ప్రధాని నరేంద్రమోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయనకు రాజకీయ జ్ఞానం లేదని... ప్రధాని స్థాయిలో వున్న ఆయనకు అసలు అధికారం ఎలా నడపాలో తెలుసా’’ అనే తరహాలో విమర్శల జల్లులు కురిపించారు.
హైదరాబాదులో శాంతిభద్రతల మీద, పోలీసింగ్ శాఖపై పూర్తి అధికారాన్ని గవర్నర్ చేతుల్లో పెడుతున్నట్టుగా కేంద్రం నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే! దీంతో టీఆర్ఎస్ పార్టీలు నేతలు.. ఈ నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతోంది. ఆ పార్టీ తరఫున నాయకులు రోజుకో వాదననను వినిపిస్తారు. ఒకవిధంగా చెప్పుకోవాలంటే... ఇప్పుడు అది పెద్ద దుమారంగా మారిపోయింది. ఇంకా రేగుతున్నట్లు కనిపిస్తోంది.
‘‘హైదరాబాద్ నగర్ మీద పూర్తి సర్వాధికారాలు కేవలం తెలంగాన ప్రభుత్వానికి మాత్రమే వున్నాయని... దీనిలో అనవసరంగా కేంద్రం జోక్యం చేసుకోవడం చాలా దారుణమని’’ అంటూ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే.. ‘‘గతంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీకి... ఆయా రాష్ట్రాలకు వుండే అధికారాల గురించి ఆమాత్రం జ్ఞానం కూడా లేదా’’ అని ఆరోపణలు చేశారు. ‘‘మా అధికారం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more