Venkaiah naidu pokiri dialogu shock opposition parties

venkaiah naidu pokiri dialogu, naidu pokiri dialogu shock opposition parties, venkaih naidu fire on opposition parties, congress party, bjp.

venkaiah naidu pokiri dialogu shock opposition parties, venkaih naidu fire on opposition parties

నాయుడు పోకిరి డైలాగ్!

Posted: 06/23/2014 08:18 AM IST
Venkaiah naidu pokiri dialogu shock opposition parties

‘‘ఎప్పుడొచ్చం అన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా’’ అన్నది పాయింట్. కానీ ఇక్కడ కేంద్ర మంత్రి వెంకయ్య నాయడు మాత్రం ‘‘ఎలా కొట్టెం అన్నది కాదు.. దెబ్బ తగిలిందా లేదా’’ న్నది పాయింట్. మొదటి దెబ్బకే ఇలా అయితే రాబోయే దెబ్బలకు ఎలా నిలబడతారు అని ప్రతిపక్ష పార్టీల పై పోకిరి డైలాగ్ చెప్పి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అన్ని దెబ్బలు కొడితే నొప్పిలేదు గానీ..మేము తొలిదెబ్బకే.. మా పై ఇన్ని నిందలు ఎలా మోపుతారని వెంకయ్య నాయుడు.. పంచె పైకి కట్టి మాట్లాడటం జరిగింది.

మా ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా కాలేదు. మా వల్లే నిత్యవసరాల ధరలు పెరిగాయా? అని ప్రశ్నించారు. ప్రభత్వం అనుసరిస్తున్న తీరు వల్లే నిత్యావసరాల ధరలు పెరిగాయని ప్రతిపక్షాలు మాపై నిందలు మోపుతున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో విద్యుత్ కోతలుంటే బిజెపి కార్యాలయం ముందు ధర్నాలు చేస్తరా? అని నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో హిందీని వాడాలని యూపిఏ ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో తమకెలాంటి సంబంధం లేదని వెంకయ్య పేర్కొన్నారు. రైలు ఛార్జీల పెంపు నిర్ణయం యూపీఏ ప్రభుత్వమే తీసుకుందని, వాటిని మేం అమలు చేశామని వెంకయ్య నాయుడు తెలిపారు.

మోడీ ప్రభుత్వం ఏర్పాడి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. అప్పుడే మా ఇన్నీ నిందలు మోపటం చాలా దారుణం అని వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నప్పుడు..పోకిరి సినిమాలో మహేష్ బాబు కనిపించాడని .. మీడియా వర్గాలు అంటున్నాయి. మేము ఇప్పుడు 1 దెబ్బ కొట్టాం... ఇంకా 999 దెబ్బలు మిగిలి ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలకు ఇన్ డైరెక్టర్ గా చెప్పటంతో వారు షాక్ తిన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles