కేంద్ర రసాయన, ఎరువుల మంత్రి నిహాల్ చంద్ మేఘ్వాల్ కి జయ్ పూర్ జిల్లా కోర్టు నాలుగు సంవత్సరాల క్రితం చేసిన అత్యాచార ఆరోపణ మీద నోటీసు పంపించింది.
మోదీ మంత్రి వర్గంలో రాజస్తాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి 42 సంవత్సరాల మేఘ్వాల్ రాజీనామా చెయ్యాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్, ఇది మోదీకి ఒక సవాల్ అని, ఇది గంభీరమైన విషయం కాబట్టి మోదీ మేఘ్వాల్ ని మంత్రి పదవినుంచి తప్పించాలని అన్నారు. పారదర్శకత, నిరాడంబరతల మీద ఉపన్యాసం ఇచ్చే మోదీ దీన్ని తేలిగ్గా తీసుకోగూడదని సచిన్ పైలట్ అన్నారు.
2011 లో ఒక మహిళ చేసిన ఆరోపణ ప్రకారం, ఆమె భర్త ఆమెకు రోజూ మత్తుమందిచ్చి పడుకోబెట్టి అతని స్నేహితులను పిలుస్తుండేవాడట. అలా ఆమె అనుమతి లేకుండా ఆమె స్పృహలో లేనప్పుడు ఆమె మీద అత్యాచారం చేసిన వాళ్ళల్లో మేఘ్వాల్ కూడా ఉన్నారట. ఆమె మేఘ్వాల్ తో పాటు మరో 17 మంది మీద అభియోగం మోపటం జరిగింది. తన భర్త చిన్న రాజకీయ నాయకుడు అవటంతో రాజకీయరంగంలో ఎదగటం కోసం అలా చేసారని ఆమె కారణం కూడా చెప్పుకొచ్చింది. ఈ అభియోగం నిరాధారమైనదని, కట్టుకథని రాజస్తాన్ పోలీసులు 2012లో ఆ కేసుని మూసివేసారు.
ఆతర్వాత ఆమె జిల్లా కోర్టుకి పోగా అక్కడ కూడా ఆమె అభియోగాన్ని అక్కడ కూడా డిస్మిస్ చేసారు. అయితే ఆమె మరోసారి రివ్యూ పిటిషన్ ని వెయ్యటంతో జిల్లా కోర్టు దీని మీద ఆగస్ట్ 20 లోపులో స్పందించవలసిందిగా నోటీసులు జారీచేసింది.
ఆతర్వాత మేఘ్వాల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఈ విషయంలో చర్చించి తన స్థితిని స్పష్టం చేసారు. దానితో భారతీయ జనతా పార్టీ, ఈ విషయంలో మేఘ్వాల్ రాజీనామా చెయ్యవలసిన అవసరం లేదని ప్రకటించింది.
"ఈ కేసు మీద 2012 లో గెహ్లాత్ ప్రభుత్వంలో పోలీసులు ఈ కేసుని మూసివేసినట్లుగా తెలియజేసారు. దాన్ని ఫిబ్రవరి 2014లో జిల్లా కోర్టు కూడా స్వీకరించింది. ఇవి కేసు పూర్వాపరాలు. ఈ కేసులో మరేమైనా ముందుకు వెళ్తే ఆ సందర్భాన్నిబట్టి న్యాయపరంగా మేము సరైన సమాధానం ఇస్తాం" అంటూ భాజపా అధికార ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ప్రకటన చేసారు.
ఫిర్యాదు చేసిన మహిళ తన భర్త, అతని సోదరుడు కలిసి తనకి మత్తు మందిచ్చి సమాజంలో బాగా పలుకుబడివున్న వారితో అత్యాచారం చేయించేవారని పేర్కొంది. ఆమె చేసిన ఎఫ్ఐఆర్ లో మేఘ్వాల్ తో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక పోలీస్ ఆఫీసర్, రాజస్తాన్ యూనివర్శిటీ మాజీ ప్రెసిడెంట్ ఉన్నారు.
అయితే నిరాధారంగా వేలెత్త చూపించినంత మాత్రాన ఒక మంత్రని పదవి నుంచి తొలగిస్తారా అన్నది ప్రశ్న. అలా చేసుకుంటూ పోతే ఎవరి మీదైనా ఎవరైనై ఏమైనా ఆరోపణ చెయ్యవచ్చు.
కానీ అదే నిజమైతే, ఆమె ఆధారాలు ఎక్కడి నుండి తేగలదు? ఆమె భర్త కానీ మరిది కానీ చేసిన పనిని ఒప్పుకుంటారా? అత్యాచారం చేసినవారిలో ఎవరైనా తమ తప్పును అంగీకరిస్తారా? ఆధారాలు ఎక్కడి నుండి దొరుకుతాయి? దోషిని గుర్తించమని పోలీసులు ఇంతవరకు బాధితురాలిని అడగకపోవటం విశేషం!
అందువలన న్యాయపరంగా ఏం జరుగుతుందన్నది వేచి చూడవలసిందే!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more