తెదేపా భాజపాల మధ్య గత పదిహేను రోజులుగా కొలిక్కి రాకుండా ఉన్న ఎన్నికల పొత్తులు ఉగాదినాడు సీట్ల విషయంలో రాజీకి రావటంతో ఇరు ప్రాంత నాయకులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఇదే విషయంలో అధికారికంగా ప్రకటన కూడా వెలువడనుంది.
రాష్ట్ర స్థాయిలో అసంపూర్ణంగా జరిగి నాయకులకు అసంతృప్తిని మిగిల్చిన పొత్తుల మీద చర్చలు జాతీయ నాయకుల ప్రమేయంతో ముడి విడివడి ఒక అవగాహనకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. భాజపా తరఫున అరుణ్ జైట్లీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ జవదేకర్ లు, తెలంగాణా తెదేపా తరఫున ఎర్రబెల్లి దయాకరరావు, తెదేపా తెలంగాణా అధ్యక్షుడు రమణ, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు మధ్య ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఎవరికెన్ని స్థానాలన్నదాంట్లో రాజీ ఏర్పడింది.
తెలంగాణా ప్రాంతంలో భాజపాకి 8 ఎంపీ సీట్లు, 45 అసెంబ్లీ సీట్లు, సీమాంధ్రలో 4 ఎంపీ సీట్లు, 12 అసెంబ్లీ సీట్లు ఇవ్వటానకి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది, భారతీయ జనతా పార్టీ దాదాపూ అంగీకరించింది. ఇక ఎవరు ఏ స్థానంలో అన్నదాని మీద కూడా అవగాహనకు రావలసివుంది.
ఇంతకాలం ఒక అవగాహనకు రాకపోవటానికి కారణం, తెరాస, వైకాపాలు భాజపాకి కోరినన్ని సీట్లు ఇస్తామని సంకేతాలివ్వటమే. అయితే ఎన్నికలలో లంగాణాలో తెదేపాకి సీమాంధ్రలో భాజపాకి తగినంత విజయం సంప్రాప్తించదనే ఉద్దేశ్యంతో ఇరు పార్టీలు పొత్తుకి రాజీ అయ్యాయి. పైగా సర్వే రిపోర్ట్ ల ప్రకారం తెరాస వైకాపాలు ఢీలా పడిపోయాయని తేలటంతో భాజపా తన పట్టు వీడి కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది.
భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సుదీర్ఘమైన చర్చలలో నిజానికి పొత్తు విషయంలో భాజపా నాయకులలో రెండు అభిప్రాయాలను వెలిబుచ్చారు. తెలంగాణా నాయకులు తెదేపాతో పొత్తు వద్దంటే సీమాంధ్ర నాయకులు కావాలని కోరారు.
సీట్లేమీ డిమాండ్ చెయ్యని పవన్ కళ్యాణ్ ఎలాగూ ఆమోదయోగ్యులే. లోక్ సత్తా పార్టీ తో కూడా సీట్ల విషయంలో చర్చలు జరుగనున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more