కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సినీమా స్టార్స్ తో నిండిపోతుంది. టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్, శాండిల్ వుడ్ నుండి సినీ తారలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. రాబోయే లోక్ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకోని , కాంగ్రెస్ పార్టీ సినీతారల పై ఆదరపడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ తరపున సినీ నటులే ఎక్కువగా పోటీ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నటి నగ్మా, జయప్రద, భోజ్ పురి నటుడు రవి కిషన్ లకు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ సీట్లు కేటాయించినట్లు సమాచరం. ఒకప్పుడు దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పోటీ చేసిన యూపీలోని చారిత్రాత్మక నియోజకవర్గం పుల్ పుర్ ను నగ్మాకు కేటాయించాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం భోజ్ పురిలో ఆదరణ ఉన్న నగ్మా గ్రామీణ ప్రాంతాల్లో తన ఫేమ్ తో ఓట్లు రాబడుతుందని నమ్ముతున్నారు. ఏఐసీసీగా సభ్యురాలైన ఆమె గతంలో 2004 లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన అనుభవం ఇప్పుడు కూడా ప్రజలను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారు.
ఇక భోజ్ పురిలో విభిన్మ నటనతో స్టార్ డమ్ హోదా ఉన్న నటుడు రవి కిషన్ కు తూర్పు యూపీ నుంచి సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటికొచ్చి, రాంపూర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జయప్రద త్వరలో హస్త తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యూపీలోని మైనారిటీలు ఎక్కువగా ఉన్న మోరాదాబాద్ నుంచి పోటీ చేయాలను అనుకుంటున్నారు.
జయప్రద కు ఈ సారి ఆంద్రపదేశ్ నుండి పోటీ చేయలని ఉందని ..అనేక సార్లు మీడియా ముందు చెప్పిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో జయప్రద కాంగ్రెస్ పార్టీలోకి చేరి, కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లు వింటుందా? అని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు.
ఏమైన ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటమి గాలులు బాగా వీస్తున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఎంతమంది సినీ స్టార్స్ ను నిలబెట్టిన..ఫలితం శూన్యం అని ఆ సర్వేలు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more