పార్లమెంట్ లో ఎప్పుడూ లేని విధంగా లోపలా బయటా కూడా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టటంతో లోపల, ఈ లోపులో బిల్లు ప్రవేశపెడతారని తెలిసి పార్లమెంటు బయట ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కేవలం ఎంపీలు, మీడియా ప్రతినిధులను మాత్రమే పార్లమెంటు ఆవరణలోకి అనుమతించిన పోలీసు బలగాలు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలను సైతం అక్కడి నుండి తరిమి కొట్టారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న సీమాంధ్ర తెలంగాణా ప్రాంత ఆందోళనకారులను పోలీసులు అక్కడినుండి ఈడ్చుకుని పోయారు. అయినా ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను నియంత్రించటం పోలీసులకు కష్టమే అయింది.
ఇక పార్లమెంటు లోపల అనుకున్న ప్రకారం స్పీకర్ మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టారు. వెంటనే సీమాంధ్ర ఎంపీలు ఒక్కసారిగా సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ మైకులు ఫైళ్ళను చిందరవందర చేసారు.
లగడపాటి రాజగోపాల్ మిరియాల పొడిని స్ప్రే చేసారు. జరిగిందేమిటో తెలిసే లోపులో ఎంపీలకు దగ్గులు కళ్ళు మండటం జరిగి ఉక్కిరిబిక్కిరయ్యారు. తెలంగాణా ఎంపీలు లగడపాటిని పక్కకు లాగేసారు. మిరియాల పొడి తన మీద కూడా ప్రభావం చూపటంతో లగడపాటి అపస్మాస్థితిలోకి పోయారు. లగడపాటిమీద ఇతర ఎంపీలు దాడి చేయబోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. లగడపాటితో పాటు మరో ముగ్గురు ఎంపీలను ఆంబులెన్స్ లో వైద్య చికిత్స కోసం తీసుకెళ్ళవలసివచ్చింది. అందులో పొన్నం ప్రభాకర్ ఉన్నారు.
లోక్ సభ వాయిదా పడింది. కానీ లోక్ సభలో భౌతిక దాడులు మాత్రం ఆగలేదు. ముష్టిఘాతాలతో ఒకరి మీదొకరు ప్రహారాలు చేసుకున్నారు. తెదేపా ఎంపీ వేణుగోపాల రెడ్డి సభలోకి కత్తి కూడా తీసుకునివచ్చారు. ఎంపీల పోరాటాలను అడ్డుకోవటానికి మార్షల్స్ రంగప్రవేశం చెయ్యవలసివచ్చింది. పెప్పర్ స్ప్రే వలన భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్ కి కూడా అస్వస్థతకు లోనయినట్లుగా తెలిసింది.
సెక్రటరీ జనరల్ టేబుల్ మీద అద్దాన్ని పగలగొట్టి, మోదుగుల వేణుగోపాల రెడ్డి ఆత్మహత్య కూడా చేసుకునే ప్రయత్నం చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more