ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. ఈ రోజు రాష్ట్ర పునర్విభజన బిల్లు ముసాయిదా శాసన సభలో చర్చకు రానుంది. దాన్ని వ్యతిరేకిస్తూ చేసిన బంద్ పిలుపుకి ఎపిఎన్జీవోలు, మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా మద్దతునిస్తున్నాయని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్ అశోక్ బాబు తెలియజేసారు.
ఉద్యోగ సంఘాలే కాకుండా రాజకీయ పార్టీలు కూడా బంద్ కి మద్దతునివ్వటం విశేషం. కాంగ్రెస్ పార్టీ, తెదేపా, వైకాపా, సమాజ్ వాదీ పార్టీలు బంద్ లో పాల్గొంటున్నాయి.
చేసేద్ పునర్విభజన బిల్లుకి వ్యతిరేకంగానైనా, తెలంగాణా ప్రాంతంలో కూడా సమైక్యాంధ్రను కోరుకునేవారుండబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చామని అశోక్ బాబు అన్నారు.
కృష్ణా, కడప, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి బంద్ పాటిస్తున్నట్టుగా సమాచారం అందింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో తెలుగు దేశం తమ్ముళ్ళు ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాస్తారోకోలు, బస్సులను నిలిపివేయటాలు చేస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.
విజయవాడ, గుడివాడలలో ఆందోళనకారులు బస్సులను అడ్డుకోగా బస్సులు డిపోలకే పరిమితైవున్నాయి. కడప జిల్లాలోని 8 డిపోలలో 900 బస్సులు డిపోనుంచి బయటకు రాలేదు. గుంటూరులో బంద్ ముమ్మరంగా సాగుతోంది. విద్యాసంస్థలు ముందే మూసివేయగా దుకాణాలను, బ్యాంకులు, సినిమా హాళ్ళను మూసి వెయ్యటానికి తెదేపా వైకాపాలు విడివిడిగా పోటాపోటీగా బంద్ ని నిర్వహిస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more