Mla nagam janardhan reddy ex minister pushpaleela to join bjp

mla nagam janardhan reddy, ex-minister pushpaleela, join bjp, rajanadh singh, bjp leaders kishan reddy, telangana issue, cm kiran kumar reddy,

mla nagam janardhan reddy-ex-minister pushpaleela to join bjp

కాంగ్రెస్ పుష్పలీల -ఎమ్మెల్యే నాగం ఒకే చోట?

Posted: 06/03/2013 07:59 PM IST
Mla nagam janardhan reddy ex minister pushpaleela to join bjp

మాజీ మంత్రి పుష్పలీల కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు సిద్ధపడ్డారు. బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఆమె బిజెపిలో చేరనున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన పుష్పలీల కాంగ్రెసు అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆమె మంత్రిగా పనిచేశారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వనందుకే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పుష్పలీల చెప్పారు. దళితుల అభివృద్ధిపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కోసమేనని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆమె గతంలో విమర్శలు చేశారు.

 

తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే ఉద్దేశంతోనే పుష్పలీల బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ నగార సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. నిజాం కళాశాల మైదానంలో జరుగుతున్న బహిరంగసభలో నాగం జనార్ధన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ తో విబేధించి బయటకు వచ్చిన నాగం జనార్ధన్ రెడ్డి కొంతకాలంగా సొంత కుంపటి తెలంగాణ నగార సమితితో ఒంటరి పోరాటం చేస్తున్నారు. అయితే ఇటీవల బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి పుష్పలీల, నాగం కలిసి ఒకే కండువా వేసుకన్నారు. ఈ ఇద్దరు బీజేపిలో చేరటంతో కాంగ్రెస్ నాయకులు చెవులు కోర్కుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles