మాజీ మంత్రి పుష్పలీల కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు సిద్ధపడ్డారు. బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఆమె బిజెపిలో చేరనున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన పుష్పలీల కాంగ్రెసు అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆమె మంత్రిగా పనిచేశారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వనందుకే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పుష్పలీల చెప్పారు. దళితుల అభివృద్ధిపై కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కోసమేనని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆమె గతంలో విమర్శలు చేశారు.
తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే ఉద్దేశంతోనే పుష్పలీల బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ నగార సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. నిజాం కళాశాల మైదానంలో జరుగుతున్న బహిరంగసభలో నాగం జనార్ధన్ రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కాషాయం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ తో విబేధించి బయటకు వచ్చిన నాగం జనార్ధన్ రెడ్డి కొంతకాలంగా సొంత కుంపటి తెలంగాణ నగార సమితితో ఒంటరి పోరాటం చేస్తున్నారు. అయితే ఇటీవల బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి పుష్పలీల, నాగం కలిసి ఒకే కండువా వేసుకన్నారు. ఈ ఇద్దరు బీజేపిలో చేరటంతో కాంగ్రెస్ నాయకులు చెవులు కోర్కుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more