Telangana satyagraham png

తెలంగాణా సత్యాగ్రహం

Posted: 04/27/2013 11:06 AM IST
Telangana satyagraham png

ఛలో సంసద్ అంటూ తెలంగాణా సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొనటానికి 19 భోగీలతో కూడిన ప్రత్యేక రైలు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతోంది. 

తెలంగాణా ఐక్యకార్యాచరణ సమితి ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ లోని జంతర్ మంతర్ లో 29, 30 తేదీలలో నిర్వహించనున్న తెలంగాణా సత్యాగ్రహం అనే దీక్ష కోసం ఐకాస కార్యకర్తలు, తెలంగాణా ఉద్యమకారులు ఢిల్లీ చేరుకుంటారు.  దీక్షలో భారతీయ జనతా పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్, ఇంకా సిపిఐ, బిఎస్పీ నేతలు కూడా హాజరుకానున్నారు.  కెసిఆర్ ఈ దీక్షలో పాల్గొనవచ్చు అని చెప్తున్నారు కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. 

రాజకీయ వ్యూహంలో భాగంగా ఏ రాజకీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోకూడదని ఈ రోజు తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తన నిర్ణయాన్ని తెలియజేస్తున్న సందర్భంగా ఢిల్లీ లోని తెలంగాణా సత్యాగ్రహానికి ఎవరెవరు హాజరవుతారన్నది ఇంకా ఇదమిద్ధంగా తేలటం లేదు. 

తెలంగాణా సత్యాగ్రహం ఉద్దేశ్యం- పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టించటానికి వత్తిడి తేవటం. 

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles