Botsa satyanarayana fire on opposition parties

pcc chief botsa satyanarayana, chief minister kiran kumar reddy, opposition parties, power hike, botsa satyanarayana, sattibabu, congress party, government,

botsa satyanarayana fire on opposition parties

విపక్షాలపై విరుచుకుపడిన సత్తిబాబు

Posted: 04/07/2013 02:03 PM IST
Botsa satyanarayana fire on opposition parties

పీసీసీ అధ్యక్షుడు  బొత్స సత్యనారాయణ  విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.  అవిశ్వాస తీర్మానంలో    ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఓటు వేసిన ఎమ్మెల్యేలును రెచ్చగొట్టి పంపుతున్నారు.  అయితే అలాంటి వారి పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని  బొత్స చెప్పారు.  అయితే  కొంత మంది కావాలనే దొంగ దీక్షలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం  పేద- మద్యతరగతి వారికి కోసం ప్రత్యేక రాయితీలు కల్పించటం జరిగింది.  కొన్ని రాజకీయ పార్టీలు  తన పబ్బం గడుపుకోవటానికి  కావాలని  రాద్దాంతం  చేస్తూ .. సొంత మీడియాలో  చప్పట్లు కొట్టుకుంటున్నాయి.  అలాంటి పార్టీలకు  ప్రజలే బుద్ది చెబుతారని  బొత్స ఆవేశంగా అన్నారు.  విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజయవాడలో వెల్లడించారు. ఈ అంశంపై ఇప్పటికే స్పీకర్‑కు లేఖ రాసినట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించినా విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని ఆయన విపక్షాలపై మండిపడ్డారు. వస్త్రాలపై వ్యాట్‑ రద్దు చేయాలనే వస్త్రవ్యాపారుల డిమాండ్ సీఎం దృషికి తీసుకు వెళ్తామని ఆయన వస్త్రవ్యాపారులకు హామీ ఇచ్చారు. చిన్న వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. చట్టాన్ని ధిక్కరించి వ్యాపారం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని బొత్స సత్యనారాయణ వ్యాపారస్తులను హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles