హైద్రాబాద్ దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబు దాడి ఘటనా స్థలిని, గాయపడిన వారిని సందర్శించేందుకు వచ్చిన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల మంత్రి గులామ్ నబీ ఆజాద్ నిన్న రాత్రి మీడియా ఛానెల్ లో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచేసారు.
అటువంటి విపత్కర పరిస్థితిలోనూ హైద్రాబాద్ వాసులంతా సంయమనాన్ని పాటించారని, మత విద్వేషాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతా యుతంగా ప్రవర్తించారని, లోగడ లుంబినీ పార్క్ లోనూ, గోకుల్ చాట్ భండార్ లో బాంబు పేలుళ్ళ సమయంలో కూడా పౌరులంతా సంయమనంతా మెలిగారని, అటువంటి సమయాల్లో అలా ప్రవర్తించటం చాలా అవసరమని, హైద్రాబాద్ వాసుల మానసిక పరిణితి దీనితో అర్థమౌతోందని ఆజాద్ అన్నారు.
ఆ తర్వాత ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న చర్యలను బలపరుస్తూ, బాంబు దాడి వలన నష్టపోయినవారికి ఇంత వరకూ ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనంత నష్ట పరిహారాన్ని ప్రకటించటమే కాక, కార్పొరేట్ హాస్పిటల్స్ లో వారికి మెరుగైన వైద్య సేవలనందించటమనేది చాలా ఉదాత్తమైన చర్య అని కొనియాడారు.
చివరగా, ఆజాద్ మీడియాను కూడా ప్రశంసించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ ఏ భాషలోనూ మీడియా వారంతా ఎంతో మానసికంగానూ వృత్తిపరంగానూ పరిపక్వతను ప్రదర్శిస్తూ, మత విద్వేషాలు రేగే విధంగా మాట్లాడకుండా, జరిగిన సంఘటనలోని వాస్తవాలను ఎప్పటికప్పుడు చక్కగా కవర్ చేసారని, ఆంధ్రప్రదేశ్ మీడియాను ప్రశంసలతో ముంచెత్తారు.
తెలంగాణా సమస్య గురించి ప్రస్తావించగా, అది చాలా జటిలమైన సమస్య కాబట్టి త్వరగా దాని విషయంలో నిర్ణయం తీసుకోమని సిఫారస్ చేసానని చెప్తూ, త్వరలోనే పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని చాలా డిప్లోమేటిక్ గా చెప్పారు ఆజాద్.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more