ముంబయి దాడుల కేసులో మరణ శిక్ష పడ్డ పాక్ జాతీయుడు అజ్మల్ కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. నవంబర్ 8న క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు తెలియజేశాయి. 2008, నవంబర్ 26న ముంబయి నగరంలో కసబ్ తో పాటు 9 మంది ఉగ్రవాదుల నరమేథానికి పాల్పడిన ఘటనలో 166 మంది మరణించారు. ఆ మారణహోమం ఘటనలో సజీవంగా పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది కసబ్ కు ఉరిశిక్ష ను అమలు చేసినట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్ తెలిపారు. కసబ్ కు ఉరిశిక్ష అమలుపై ఆయన ముంబయిలో మీడియాతో మాట్లాడారు. కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి తిరస్కరించిన అనంతరం ఈ ఉదయం 7.30 గంటలకు ఫుణేలోని ఎర్రవాడ జైల్లో మరణ శిక్షను జైలు అధికారులు అమలు పరిచినట్లు ఆయన వెల్లడించారు. రెండు రోజుల క్రితమే కసబ్ ను ఎరవాడ జైలుకు తరలించినట్లు చెప్పారు.
కసబ్ కేసు వివరాలు
1.2008 నవంబర్ 26న జరిగిన ముంబయి దాడుల ఘటనలో ఉగ్రవాది కసబ్ సజీవంగా పట్టివేత
2. 2010, మే 3న కసబ్ పై ట్రయల్ కోర్టులో నేర నిర్థారణ, హత్య దేశంపై యుద్ద కుట్ర కేసు నమోదు
3. 2010, మే 6న కసబ్ కు మరణ శిక్ష విధించిన అదే కోర్టు
4.2011, ఫిబ్రవరి 21న బాంబే హైకోర్టు కసబ్ మరణ శిక్షను సమర్థించింది
5. 2012, ఆగస్టు 29న కసబ్ కు విధించిన మరణ శిక్షను సుప్రీం కోర్టు ఖరారు చేసింది.
6. 2012, సెప్టెంబర్ 18న రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న కసబ్
7. 2012, నవంబర్ 8న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు
8. క్షమాభిక్ష తిరస్కరన అనంతరం 2012 నవంబర్ 21న కసబ్ కు ఉరిశిక్ష అమలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more