వంటగ్యాస్ ధర శనివారం నుండి సిలిండర్కు రూ.11.42 చొప్పున పెరిగింది. ఎల్పిజి డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్ను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు చమురు కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపాయి. కమిషన్ను పెంచాలని గ్యాస్ డీలర్లు చేసిన ఒత్తిడి మేరకు ఒక్కో సిలిండర్పై ఇప్పుడిస్తున్న రు.25.83పైసల కమిషన్ను రు.37.25 పైసలకు పెంచింది. దీంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రు.410.42, ముంబయిలో రు.434.42 , కొల్కతాలో 412.42, చెన్పైలో 397.92కి పెరిగింది.
స్థానిక లెవీ రేట్లను బట్టి గ్యాస్ సిలిండర్ ధర రాష్ట్రానికో విధంగా ఉంటోంది. సబ్సిడీలేని గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం ఉన్న రు.883.5 నుంచి 921.5కు పెరిగింది. వంటగ్యాస్ డీలర్ల తరహాలోనే పెట్రోలు, డీజిల్ డీలర్ల కమిషన్ పెంపుదలపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెట్రోల్ డీలర్కు లీటర్కు 23 పైసలు, డీజిల్పై లీటర్కు పది పైసలు చొప్పున కమిషన్ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ తరహాలోనే ఈ పెంపుదల భారం కూడా పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదల రూపంలో అంతిమంగా వినియోగదారులపైనే పడుతుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సబ్సిడీ సిలిండర్ల సరఫరాను ఏడాదికి ఆరుకు కుదించాలని ప్రభుత్వం నిర్ణయించిన కొద్ది వారాల్లోనే గ్యాస్ ధర పెరగటం విశేషం.
ఇంకోవైపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ల ఒత్తిడి మేరకు ఒక ఇంటికి ఒకటే కనెక్షన్ అన్న మెలిక పెట్టి ఇప్పుడున్న 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో ఒకటిన్నర కోట్ల కనెక్షన్లను తొలగించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నా ఒక కనెక్షన్ తోనే గడపాలి. దీనికి అంగీకరించి అక్టోబరు 31కల్లా అదనపు కనెక్షన్లను అప్పగించాలని, లేని పక్షంలో ఆ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా నిలిపేస్తామని బెదిరిస్తున్నాయి.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more