మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జైత్రయాత్రలకు శ్రీశైల పుణ్యక్షేత్రంలోని ప్రధాన ఆలయ ఉత్తర ద్వార ప్రాకార గోపురం చిహ్నంగా నిలుస్తోంది. శ్రీశైలక్షేత్రానికి, శివాజీకి ఉన్న అనుబంధాన్ని ఈ గోపురం తెలియజేస్తోంది. శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లంటే శివాజీకి అత్యంత భక్తిభావం ఉండేది. 16వ శతాబ్దంలో శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించిన సమయంలో ఆలయానికి 104అడుగుల ఎత్తైన గోపురాన్ని నిర్మించారు. ఈ గోపురం మూడున్నర శతాబ్దాల తర్వాత శిథిలమైంది. దీంతో 1967లో అప్పటి ప్రభుత్వం గోపురానికి మరమ్మతులు చేపట్టిందిశిథిలమైన శివాజీ గోపురం... గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేలకూలింది. పుట్టుకతోనే వీరుడి లక్షణాలను పుణికి పుచ్చుకున్న మహాయోధుడు ఛత్రపతి శివాజీ. 1644లో 16ఏళ్ల నూనూగు మీసాల వయసులోనే తోరణ్ దుర్గాన్ని జయించి తను స్థాపించబోయే హిందూ సామ్రాజ్యానికి శంకుస్థాపన చేశారు.
1677లో సైన్య సమేతుడై కర్ణాటక దిగ్విజయ యాత్రకు బయలుదేరి మార్గమధ్యలో శ్రీశైల క్షేత్ర సందర్శనకు వచ్యారు. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించిన సమయంలో ఏర్పాటు చేసుకున్న ధ్యాన మందిరంలో పది రోజులపాటు ఇక్కడే ఉండి భ్రమరాంబదేవి కృప కోసం దీక్ష చేపట్టారు.ఈ క్రమంలో 10వ రోజున అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గం ప్రసాదించి ధర్మ సంరక్షణ కోసం పాటుపడాలని చెప్పి ఆశీర్వదించినట్లు చరిత్ర చెబుతోంది. తన పేరిట శ్రీశైల ఆలయానికి గోపురం నిర్మించాలని జనార్దనపంత్ను ఆజ్ఞాపించినట్లు, దీంతో ఆయన అక్కడే ఉండి ఆలయానికి ఉత్తర దిక్కుగా గోపుర నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ గోపురమే శివాజీ గోపురంగా ప్రసిద్ధికెక్కింది. శివాజీ స్మృతికి గుర్తుగా ఆయన తపమాచరించిన ధ్యానమందిరం ఉన్న స్థలంలో స్ఫూర్తి మందిరాన్ని నిర్మించారు.1983లో అప్పటి మహారాష్ట్ర సీఎం వసంత్దాదాపాటిల్ స్ఫూర్తికేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఇందులో శివాజీ సింహాసనంపై ఆశీనులైన భారీ విగ్రహం ఏర్పాటు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more