పాలక యుపిఎ-2, ప్రతిపక్షం ఎన్డిఎ తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని పార్ల మెంట్ శీతాకాల సమావేశాల సమయాన్ని వృధా చేశాయి. బొగ్గు గనుల కేటాయింపుల్లో రూ.1.86 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొన్న అంశంపై పాలక ప్రతిపక్ష కూటములు ప్రజల్ని మభ్యపెట్టి ఉద్దేశంతోనే పని చేశాయి. కాగ్ నివేదిక తప్పుల తడకని స్వయంగా ఆర్థిక శాస్తవ్రేత్త అయిన ప్రధాని మన్మో హన్సింగ్ చెప్పడం దేశ ప్రజల్ని ఆశ్చర్యపర్చింది. ఒక రాజ్యాంగ వ్యవస్ధను ఆయన తప్పుపట్టినపుడు ఆ వ్యవస్థ ‘కాగ్’ దేశ అత్యున్నత రాజ్యాంగ సభను 120 కోట్లమంది ప్రజల్ని, కేంద్రప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్లే కదా!తప్పుడు లెక్కలతో నివేదిక సమర్పించిన ‘కాగ్’ చీఫ్ వినోద్రాయ్పై, ఆయనకు సహకరించిన వారిపై కఠినచర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రధానమంత్రిపై ఉండదా? మరి కేంద్రప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోయిందన్న ప్రశ్న భారతీయ పౌరుడికి ఎందుకు కలగకూడదు? అంటే కేవలం ‘కాగ్’ నివేదికను తేలికచేసి చూపి బొగ్గు కుంభకోణంనుండి ప్రజల దృష్టిని మళ్లించటానికే ప్రధానమంత్రి అలా మాట్లాడారా? ఆయన తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు జవాబు ఇవ్వలేక ‘కాగ్’ విశ్వసనీయతనే ప్రశ్నించడం మన ప్రజాసామ్య దేశంలో బాధాకరమైన ఘట్టం. కొందరు కేంద్రమంత్రులు ‘కాగ్’ అస్తిత్వాన్ని సవాలు చేశారు. అసలు బొగ్గు కుంభకోణంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని, అసలు త్రవ్వకాలే జరగలేదని, జరగనప్పుడు అవినీతి అనే అంశం ఎక్కడుందని కూడా ‘కాగ్’ను నిలదీశారు. గతంలో 2-జి కుంభకోణంపై కూడా వారు అలాగే మాట్లాడారు.
రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ విభాగాలలో, ప్రభుత్వరంగ సంస్ధలో ఆడిట్ జరిపి అవకతవకలను ఎత్తిచూపే అధికారం కాగ్కు ఉంది. మరి అలాంటి ఆడిట్ వ్యవస్థను ప్రశ్నిస్తున్న పాలక యుపిఎ కూటమి మంత్రులు ‘కాగ్’కు ప్రత్యామ్నాయ వ్యవస్ధ మరేదన్నా ఉంటే దానితోనైనా ఎందుకు ఆ అవినీతిపై దర్యాప్తుకు ఆదేశించలేకపోయిందో జవాబు చెప్పాలి. పాలకపక్షం వితండవాదం చేస్తూ పార్లమెంట్ సమయం వృధా కావటానికి ప్రతిపక్షానికి అవకాశం ఇస్తూ తన జవాబుదారీతనం నుండి తప్పించుకొనే ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష ఎన్డిఎ ఈ విషయంపై ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో 13 రోజులపాటు పార్లమెంట్లో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి బొగ్గు కుంభకోణంలో వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడేదని అందరికీ తెలుసు.అయితే శిబూసోరేన్ బొగ్గుమంత్రిగా రాజీనామా చేయడం, తరచు ‘జైలు’కు వెళ్లడం వంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఆ శాఖను అజమాయిషీ చేశారని, ఆయనను అప్పటి ఆ శాఖలో ఉన్న సహాయమంత్రి, ఇతర అధికారులు తప్పుదోవ పట్టించారనేది జగమెరిగిన సత్యం. తనకళ్ళ ముందు అవినీతి జరుగుతున్నా చూస్తూ ఊరుకోవడం ప్రధానమంత్రి ఘోర తప్పిదమే, అయితే దీనికి ప్రధానమంత్రి రాజీనామాతో రూ.1.86 వేల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం ఖజానాకు వచ్చి చేరుతాయా అంటే అది సాధ్యం కాని విషయమే. ఇందుకు ప్రధాని సృష్టించిన ఆర్థిక సంస్కరణల ఫలితాలే ప్రధాన కారణమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more