భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే సంగతి. ఇన్నింగ్స్ ఆఖర్లో భారత బ్యాట్స్ మెన్ పవర్ ప్లే తీసుకుంటామని అంపైర్లకు చెప్పారు. ఇంకెక్కడి పవర్ ప్లే ..ఎప్పుడో అయిపోయింది కదా అనడంతో బ్యాట్స్ మెన్ కంగుతిన్నారు. ఇంతకీ బ్యాట్స్ మెన్ కు తెలియకుండా పవర్ ప్లే ఎలా అయిపోయింది. సాధారణంగా బ్యాటింగ్ జట్టు పవర్ ప్లేను 30 ఓవర్ల తర్వాత తీసుకుంటుంది. కానీ తొలి వన్డేలో స్కోరు బోర్డు ప్రకారం భారత్ 17వ ఓవర్లో పవర్ ప్లే తీసుకుంది. అప్పుడు సెహ్వాగ్ , కోహ్లి క్రీజులో ఉన్నారు. 21 ఓవర్లో ముగిసిన ఆ పవర్ ప్లే లో భారత్ 32 పరుగులు చేసింది వికేట్లేమి కోల్పోలేదు. బ్యాటింగ్ పవర్ ప్లే అని అంపైర్ల సూచించడంతో శ్రీలంక కెప్టెన్ అందుకు తగ్గట్టు ఫిల్డర్లను మోహరించాడు. పాపం మన బ్యాట్స్ మెన్ కు ఇదేమి తెలియక నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. ఇంతకీ తప్పు ఎక్కడ జరిగిందంటే.. 16వ ఓవర్ చివర్లో టోపి కావాలని కోహ్లి భారత డ్రెస్సింగ్ రూమ్ కు చేత్తో సైగ చేశాడు. అతడు బ్యాటింగ్ పవర్ ప్లే కోరుతున్నాడని భావించిన అంఫైర .. భారత్ బ్యాటింగ్ పవర్ ప్లే తీసుకుంటోందని వ్రుత్తాకారంలో తిప్పుతూ సైగ చేశాడు. మొత్తానికి మనవాళ్లకు తెలియకుండానే పవర్ ప్లే ముగిసింది. దీని గురించి వీరు మాట్లాడుతూ.. ఈ విషయంపై అంపైర్ ను అడిగితే.. కోహ్లీ సిగ్నల్ ఇచ్చాడు అని చెప్పాడు. కోహ్లిని ఇదే విషయంపై ప్రశ్నించగా ..పవర్ ప్లే ను నేనెప్పుడు అడిగాను.. టోపీ కావాలని డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందిని కోరానంతే అని వివరించాడు. ఇకపై టోపీ అడిగేటప్పుడు మన బ్యాట్స్ మెన్ జాగ్రత్తగా ఉంటారనడంలో సందేహమా..?
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more