రాష్టప్రతి ఎన్నికలు టిడిపిని డైలమాలో పడేశాయి. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి యుపిఎ నాయకత్వం కన్నా రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాలకు ఈ అంశం సమస్యగా మారింది. ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయనున్నట్టు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విలేఖరుల సమావేశంలోనే సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే కార్పొరేట్ కంపెనీలను నిర్వహించే టిడిపి ఎంపిలు తమ సొంత ప్రయోజనాల కోసం రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని పార్టీలో కొందరు సీనియర్లు విమర్శిస్తున్నారు. టిడిపి సిద్ధాంతం కాంగ్రెస్ వ్యతిరేకత, అలాంటప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్కు ఎలా ఓటు వేస్తారని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని, కాంగ్రెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విలీనం అవుతుందని ఇంతకాలం మనం విమర్శలు చేస్తూ వచ్చాం, అలాంటిది మనమే కాంగ్రెస్ నాయకుడికి ఓటు వేస్తే ప్రజల్లో విలువ ఏముంటుందని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. టిడిపి ఎంపిల్లో ఎక్కువ మంది కార్పొరేట్ కంపెనీల నిర్వాహకులు, తమ వ్యాపార ప్రయోజనాల కోసం వాళ్లు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వస్తున్నారనేది కొందరు నాయకుల ఆరోపణ. అయితే ఇటు చూస్తే యుపిఏ అభ్యర్థిని కాదని బిజెపి బలపరిచిన సంగ్మాకు ఓటు వేస్తే, టిడిపి బిజెపితో చేతులు కలిపారనే విమర్శ ఎదుర్కోవలసి వస్తుందని చంద్రబాబు పార్టీ నాయకులకు చెబుతున్నారు. ఇప్పటి వరకు మైనారిటీలు టిడిపి వైపు పెద్దగా రాలేదని, ఇప్పుడు ఎన్డిఏ అభ్యర్థికి ఓటు వస్తే మైనారిటీలు ఇక నమ్మరని కొందరు నాయకులు వాదిస్తున్నారు. చంద్రబాబు సైతం ఎన్డిఏ అభ్యర్థిని బలపరిచేది లేదని, ఎనిమిదేళ్ల నుంచి లౌకిక వాదం కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు.
అలాగే ఓటింగ్ను బహిష్కరించే ప్రసక్తి లేదనీ ఆయనే ప్రకటించారు. ఈ క్రమంలో ప్రణబ్ అభ్యర్థిత్వానికి మద్దతు పలకడం మినహా తమకు మరో గత్యంతరం లేదనీ స్పష్టంచేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీలో కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మనం తటస్థంగా ఉంటే జగన్ యుపిఏకు మద్దతు ఇస్తే అతన్ని మనం ఇరకాటంలో పెట్టేందుకు అవకాశం ఉందని, అనవసరంగా కార్పొరేట్ ఎంపిల మాయలో పడి కాంగ్రెస్తో కుమ్మక్కు అయ్యారనే మచ్చ తెచ్చుకోవద్దు అని సీనియర్లు కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి రాష్టప్రతి ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకున్నా టిడిపికి ఇబ్బందికరమైన పరిస్థితి తప్పేట్టుగా లేదు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more