అంతర్జాతీయ ఐ.టి సమ్మిట్ తర్వాత కార్యక్రమాలపై సీఎం కిరణ్ సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక వేత్తలు ఏఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. కొత్తగా ఎన్ని యూనిట్ల ప్రారంభానికి ఒప్పందాలు జరిగాయనే అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రెండు రోజుల సమ్మిట్ లో కొత్తగా 243ప్రతిపాదనలతో 265యూనిట్ల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని ఐ.టి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయడానికి వచ్చిన ప్రతిపానలను శాఖల వారీగా పరిశీలిస్తే పారిశ్రామిక రంగంలో 128కొత్త యూనిట్లకు గానూ 2లక్షల 78వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా 4లక్షల పది వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందన శాఖలో 92యూనిట్లు ప్రారంభానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 30వేల 990కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా దీని వల్ల సుమారు 59వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఇక మౌళిక సదుపాయల రంగంలో కొత్తగా 13యూనిట్ల ప్రారంభానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 33వేల 300కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముంది. దీని ద్వారా 16వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
ఇటు ఐ.టి రంగంలోనూ కొత్తగా 13యూనిట్ల ప్రారంభానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 22వేల 400కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా దీని ద్వారా లక్షా 40వేల మందికి ఉపాధి లభించే అవకాశంముంది. పర్యాటక రంగంలో 14యూనిట్లు ప్రారంభానికి ప్రతిపాదనలు రాగా వీటికి గానూ 2800కోట్ల పెట్టుబడులు ఆశిస్తున్నారు. దీని ద్వారా 7,250మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వైద్య, ఆరోగ్య రంగంలో కొత్తగా 4యూనిట్లు ప్రారంభానికి పారిశ్రామిక వేత్తల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకోసం 675కోట్ల పెట్టుబడులు వస్తాయని, దీని ద్వారా 5వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఉన్నత విద్యా రంగంలో ఒక యూనిట్ ప్రారంభానికి ప్రతిపాదన వచ్చింది. దీనికి 2వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీనివల్ల 40వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది. పారిశ్రామిక రంగంలో కొత్త పరిశ్రమలు రాలేదన్న వార్తలను మంత్రి గీతారెడ్డి కొట్టిపారేశారు. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న 115పరిశ్రమలలో ఇప్పటికే 4పూర్తయి 500కోట్ల టర్నోవర్ ను సాధిస్తున్నాయని తెలిపారు. వీటి ద్వారా 2000వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇంకా 91యూనిట్లు ప్రోగ్రెస్ లో ఉన్నాయని, 20యూనిట్లు ప్రాధమిక స్థాయిలో ఉన్నాయని తెలిపారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more