మెగాస్టార్ చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పై తన దైనశైలిలో విరుచుకుపడ్డారు. దీనికి కారణం మొన్న గెలిచిన రెండు ఉప ఎన్నికల స్థానాల ఉత్సాహమో లేక ఇంత ప్రచారం చేసినా రెండే గెలిచామా అన్న బాధో లేక పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత తమ వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనో ఏమో కానీ ఇన్ని రోజులు లోలోపల దిగమింగుకున్న ఆవేశాన్ని ఇవాళ రామచంద్రాపురం కార్యకర్తల మీటింగ్ లో వెల్లగక్కారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఉప ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి శాసనసభకు గెలిచిన తోట త్రిమూర్తులు కార్యర్తలతో పాటు వచ్చి చిరంజీవిని కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... మన ఓట్లు లేనిదే రెండు చోట్ల కాంగ్రెసు ఎలా గెలిచిందని ఆయన అడిగారు. ప్రజారాజ్యం కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు మాత్రమే కాంగ్రెసుకు ఓటేశారని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకుల్లో మార్పు వస్తుందని ఇంత కాలం ఎదురు చూశానని ఆయన అన్నారు. కానీ వారిలో ఏమాత్రం మార్పు రాలేదని అన్నారు. మొన్నటి ఓటమికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల పట్ల సానుభూతి మాత్రమే కాంగ్రెసు ఓటమికి కారణం కాదని, కాంగ్రెసు వైఫల్యాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల పట్ల చూపుతున్న వివక్షను తాను సహించలేకపోతున్నానని, వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వకపోతే కాంగ్రెసు పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని చిరంజీవి అన్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చినవారికి తగిన ప్రాధాన్యం భవిష్యత్తులో ఇస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సీఎం కిరణ్, పీసీసీ ఛీప్ బొత్స ఢిల్లీలో ఉండంగా చిరంజీవి ఇలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏమిటోనని కాంగ్రెస్ వర్గాల్లో చర్చమొదలైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more