ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు పార్టీ నాయకులతో మంతనాలు జరిపారు. ఈ వ్యవహారం వల్ల జగన్పై సానుభూతి పెరిగే అవకాశం ఉందనే అంశంపై చర్చించారు. ఆస్తుల స్వాధీనం వ్యవహారంలో ప్రచారం తప్ప వాస్తవంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఒకవైపు ధ్వజమెత్తుతూ మరోవైపు ఆస్తులను మొత్తం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని టిడిపి డిమాండ్ చేస్తోంది. జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పెరుగుతుందా? లేక పార్టీ బలహీనపడుతుందా? అన్న ప్రశ్నలపై తెలుగుదేశంలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. జగన్ ఆస్తులను ఏ క్షణంలోనైనా స్వాధీనం చేసుకోవచ్చునని, జగన్ను అరెస్టు చేయవచ్చునని సాగుతున్న ఊహాగానాలపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టిడిపి నాయకులతో చర్చించారు.
కాగా, సానుభూతి పని చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు చర్చల అనంతరం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ అంశంపై వేరువేరుగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కొన్ని ఖాతాలను మాత్రమే స్తంబింపజేయడం వల్ల ప్రభుత్వం సాధించేదేమీ లేదని రేవంత్రెడ్డి విమర్శించారు. జగన్కు మొత్తం 19 ఖాతాలు ఉన్నాయని వాటిపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేవలం ప్రచారం కోసమే ప్రభుత్వం హడావుడి చేస్తున్నదే తప్ప వాస్తవంగా ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదని విమర్శించారు. జగన్ ఆస్తులను స్వాధీనం చేసుకొని సంక్షేమ హ్టాస్టళ్ల పిల్లలకు వసతులు కల్పించాలని వర్ల రామయ్య కోరారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రివర్గానికి వెన్నుముక లేకుండా చేశారని విమర్శించారు. హడవుడిగా సంతకం చేశానని మంత్రి మోపిదేవి వెంకటరమణ చెప్పడమే దీనికి సాక్షమని అన్నారు. జగన్ అస్తులను స్వాధీనం చేసుకోవాలని తెలుగు యువత నాయకులు బీద రవిచంద్రయాదవ్, మద్ద్భిట్ల సూర్యప్రకాశ్, ఎంవి సత్యనారాయణ రాజు విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more