ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి బంగారు భవిష్యత్ ఉందని అమెరికా కాన్సులేట్ జనరల్(చెన్నై) కామర్స్ అధికారి జేమ్స్ గోల్సెన్ అన్నారు. దక్షిణ భారతదేశ ఆపరేషన్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన నగరంలో కానెఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్(సిఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.ఆ దిశగా అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పూర్తి సహకారం లభించే అవకాశం ఉందన్నారు. భవిష్యత్లో ఎన్నో బహుళ జాతీయ సంస్థలు నగరానికి రానున్నాయని, తద్వారా యువతకు మరింత ఉపాధి అవకాశం కలుగుతుందన్నారు. మెడికల్, లైఫ్ సైనెసస్, ఎనర్జీ, మినరల్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయన్నారు. మరెన్నో సంస్థలు ఆసక్తి చూపుతున్నట్టు చెప్పారు.
కొంతకాలంగా విశాఖ అభివృద్ధిపై పలు చర్యలు నిర్వహించామని, తద్వారా అంతర్జాతీయ సంస్థలు తమ శాఖలను విస్తరించేందుకు ఆసక్తి చూపాయన్నారు. సిఐఐతో సంయుక్తంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు, అవగాహన కల్పించేందుకు ఎన్నో సదస్సులు నిర్వహించినున్నట్టు తెలిపారు. అమెరికా కాన్సులేట్, హైదరాబాద్శాఖ ఉప కాన్సుల్ మాథ్యు స్టాన్నార్డ్ మాట్లాడుతూ అమెరికా వెళ్ళేందుకు వీసాల జారీ విధానంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నామని, అయితే విద్యార్థులకు, ఇతర సామాజిక సేవలకు వెళ్ళే వారికి సడలింపు ఇస్తున్నట్టుప్రకటించారు. విదేశాలకు వెళ్ళే వారికి తమ సంస్థ అందించే వీసాలను వాటి కాలపరిమతి, తదితర అంశాలను ఆయన వివరించారు. ఆఖరి గడువులోపల కూడా వచ్చే వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులని భావిస్తే వారికి తక్షణం వీసాలు అందించిన దాఖలాలున్నాయని మాథ్యు స్టాన్నార్డ్ అన్నారు. ఈ సమావేశంలో సిఐఐకు చెందిన పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అమెరికా కాన్సులేట్ అధికారులు కీలక అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐఐ విశాఖ శాఖ అధ్యక్షుడు పికె చాంద్(విశాఖ స్టీల్ప్లాట్ డైరెక్టర్), ఉప అధ్యక్షుడు జి.సాంబశివరావు, సింబయోసిస్ ప్రతినిధి ఒ.నరేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more