చైనా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర పాఠశాల విద్యామంత్రి శైలజానాథ్ చిక్కుల్లో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆయన తన వ్యక్తిగత స్థాయితో చైనా పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రిగా ఎవరు కూడా అధికారిక హోదాతో చైనా పర్యటనకు వెళ్లకూడదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో శైలజానాథ్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ)లో గతంలో ఆయన పనిచేశారు. చైనాలో వారం పాటు జరిగే యువజన వ్యవహారాలపై జరుగుతున్న వారం రోజుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఆయన చైనా వెళ్లారు. ఆయన చైనా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అయితే, వీలు కాలేదని అంటున్నారు. అయినా శైలజానాథ్ ఈ నెల 8వ తేదీన చెన్నైకి వెళ్లి, మర్నాడు చైనాకు బయలుదేరి వెళ్లారు.
చైనా విమానాశ్రయంలో దిగగానే తాను భారతదేశానికి చెందిన మంత్రినని ఆయన చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో చైనా అధికారులు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, శైలజానాథ్కు అనుమతి లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పినట్లు తెలుస్తోంది. అధికారిక హోదాలో పర్యటన చేస్తే దౌత్యపరమైన పాస్పోర్టును వాడుకోవడానికి వీలుంటుంది. శైలజానాథ్ విషయంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో తమకు వివరణ ఇవ్వాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more