పనిచేస్తున్న చోట తమ కోరికలను తెలియజేస్తూ, యాజమాన్యం అందుకు సమ్మతించకపోతే సమ్మె చేసే హక్కు ఉద్యోగులందరికీ ఉంది. అయితే ఇంకా విద్యార్థి దశలోనే ఉన్న జూనియర్ డాక్టర్లకు కూడా ఇది వర్తిస్తుందా అంటే మానవతా దృక్పథంతో చూస్తే కాదనే అనాలి కానీ న్యాయపరంగా చూస్తే ఔనని అనాల్సివస్తుంది. ఎందుకంటే విద్యార్థులు కూడా తాము చదువుకునే చోట పరిస్థితులు అనుగుణంగా లేకపోతే అందుకు నిరసనగా తరగతులను బహిష్కరించి సమ్మె చెయ్యటం పరిపాటే. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో నెలకొన్న పరిస్థితి చూస్తుంటే, జూనియర్ డాక్టర్ల సమ్మె వలన సకాలంలో వైద్య సేవలందక చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.
అయితే దీనికి వైద్యలనే తప్పుపట్టటం కూడా సరికాదు. ఎప్పటి నుంచో మా కోరికలను తెలియజేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు కాబట్టి సమ్మెకు దిగవలసి వచ్చింది, సమ్మె చేస్తేనే ప్రభుత్వ వైఖరి ఇలా ఉంటే ఇక విధుల్లోకి పోతే ఎలా ఉంటుంది అని జూడాలు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది కానీ జూడాలే పట్టు విడవటం లేదు, అన్ని కోరికలనూ సమ్మతించాం, స్టైఫండ్ విషయంలో కూడా వచ్చే నెల నుంచి 15 శాతం పెంపుకి సమ్మతించాం అయినా చిన్నపిల్లలు మంకు పట్టుపట్టినట్టు వీళ్ళంతా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి గీతారెడ్డి అన్నారు. జూడాల సమస్య మీద నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారితో చర్చించిన జూడా సంఘ నాయకులు అనుమతించిలేదు. వారిని లొంగదీసుకోవటానికి ప్రభుత్వం సర్వవిధాలా ప్రయత్నిస్తోంది.
సామాన్య ప్రజల సొమ్ముతోనే మీరు చదుపుకుంటున్నారు, ఒక్కో వైద్య విద్యార్థి మీద ప్రభుత్వం 22 లక్షలు ఖర్చుపెడుతోంది, అయినా మీరు ఆ సామాన్య ప్రజలకు అందించాల్సిన వైద్య సేవలందించకపోవటం శోచనీయం, విద్యార్థి దశలోనే మీకు వచ్చే స్టైఫండ్ తక్కువేమీ కాదని ఇలా ఎన్నో విధాలుగా వైద్య శాఖా మంత్రి కొండ్రు మురళి అన్నా ఫలితం లేకుండా పోయింది. జూడాలు అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. అయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దామనే ప్రభుత్వం చూస్తోంది.
ఇటు ప్రభుత్వం అటు జూడాలు ఇరువర్గాల పట్టుదలల వలన మధ్యలో పేద ప్రజలు బలౌతున్నారు. వారంతా ప్రైవేటు వైద్యాన్ని భరించలేని పేదలే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more