బందర్ పోర్టు నిర్మాణానికి శంఖుస్థాపన చేసి మూడేళ్ళు గడిచినా ఇంకా ఆ పని మొదలవకుండా జాప్యం జరుగుతోంది. పోర్ట్ వస్త్ జిల్లా అభివృద్ధికి, జిల్లాలో ఉపాధి పెంపుదలకు తోడ్పడుతుంది. ఇందుకు నిరసనగా సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర రేపు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి అనగా 21 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకూ 30 గంటలపాటు నిరవధికి నిరాహార దీక్ష చేస్తామని భాజపా జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకట కృష్ణ తెలియజేసారు.
మరోసారి 30 గంటలు ఈ నెల 31 వ తేదీనుంచి ఫిబ్రవరి 1 వరకు బందర్ కోనేరు సెంటర్ లో దీక్ష చేపడతామని కూడా ఆయన చెప్పారు. దానితో పాటుగా కలెక్టర్ కి వినతిపత్రాన్ని కూడా ఇస్తామని ఆయన అన్నారు.
ఈ రెండు సందర్భాల్లోనూ చేసిన ఆందోళన వలన ఫలితం కనిపించని పక్షంలో ఫిబ్రవరి 10 నుండి నిరవధిక దీక్ష చేస్తామని రామినేని హెచ్చరించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more