మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ కు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ నాయకుడు నాగం జనార్ధనరెడ్డి రాజీనామాను ఆకస్మికంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించడం వెనుక ఉన్న కద ఏమిటన్నది చర్చనీయాంశంగా ఉంది. నాగం జనార్దనరెడ్డి తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత టిడిపిపై విమర్శలు కురిపించారు. తదుపరి తెలంగాణ రాష్ట్రం సాధనకోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దానిని ఆమోదించాలంటూ ఆయన రకరకాల ఆందోళనలు చేపట్టారు.ఒకసారి ఏకంగా ఉపసభాపతి ఛాంబర్ లోకి వెళ్లి తలుపు వేసుకుని కూర్చున్నారు. ఆయనతోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నారు. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టుకు ఇచ్చిన పిటిషన్ లో తాను తెలంగాణ కోసం రాజీనామా చేశానని పేర్కొన్నారు. నిజానికి స్పీకర్ కావాలనుకుంటే ఆ పాయింట్ మీద రాజీనామాను తిరస్కరించవచ్చు. అయితే ఇప్పటికే పలుమార్లు తనపై ఒత్తిడి తెచ్చినందున నాగం రాజీనామాను ఆమోదించాలని ఆయన భావించారు. ఒకవేళ హైకోర్టు కనుక నాగం పిటిషన్ ను స్వీకరించి నోటీసులు జారీ చేస్తే అప్పుడు అది మొత్తం పెండింగులో పడే అవకాశం ఉంటుంది. ఒక దశలో అలా చేయాలని కూడా స్పీకర్ కార్యాలయం ఆలోచించిందని అంటారు.కాని ఆకస్మికంగా స్పీకర్ మనసు మార్చుకోవడం వెనుక కాంగ్రెస్ ,టిడిపిల రాయబారం కూడా ఉందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. వచ్చే శాసనసభ సమావేశాలలో నాగం మళ్లీ తీవ్ర స్థాయిలో స్పీకర్ పైన,ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపైన విరుచుకుపడే అవకాశం ఉందని , తన రాజీనామా ఎందుకు ఆమోదించలేదని హంగామా సృష్టించే అవకాశం ఉందని , అందువల్ల ఆయన రాజీనామా ఆమోదిస్తే తమకు అభ్యంతరం లేదని పరోక్షంగా స్పీకర్ కు టిడిపి , కాంగ్రెస్ వర్గాల నుంచి సంకేతాలు వచ్చాయని, దానిని కూడా పరిగణనలోకి తీసుకుని స్పీకర్ నాగం జనార్ధనరెడ్డి రాజీనామాను ఆమోదించారని ఒక సీనియర్ నేత వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more