సాధారణంగా.. ఏ వంటకంలోనైనా ఎన్ని దినుసులు వేసినప్పటికీ దానికి ఉప్పు కలిపితేనే మంచి రుచి వస్తుంది. అప్పుడు ఆ ఆహారం భుజించడానికి శుచిగా వుంటుంది. ఒకవేళ ఉప్పు లేకపోతే.. ఆ వంటకాన్ని అసలు తినడానికే వీలు కాదు. కాబట్టి.. ప్రతివంటకంలోనూ ఉప్పు ఎంతో అవసరం. అయితే.. ఉప్పుతో రుచి వస్తుంది కదాని ఎక్కువగా వేసుకుంటే.. అంటే సంగతులని నిపుణులు అంటున్నారు.
ఉప్పును పరిమితంగానే తీసుకోవాలని, లేకపోతే ప్రాణాలమీదకే వస్తుందని ఓ అధ్యయనం తేల్చింది కూడా! ఆ అధ్యయనం ప్రకారం.. అదనంగా ఉప్పు తీసుకున్న కారణంగా 2010లో ప్రపంచవ్యాప్తంగా 16 లక్షలమందికి పైగా మరణించారు. ఉప్పు అధిక మోతాదులో వాడడంతో వారందరూ గుండె సంబంధ సమస్యలకు గురై మృత్యువాత పడ్డారని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (ఎన్ఈజేఎం)లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఈ అధ్యయనాన్ని టఫ్ట్స్ యూనివర్శిటీకి చెందిన ఓ వంద మంది సభ్యుల బృందం చేపట్టింది. మొత్తం 187 దేశాలకు చెందిన ప్రజల ఆహార అలవాట్లను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. ఈ పరిశీలన అనంతరం వెలువడిన నివేదికలో భాగంగా ఉప్పు మితంగానే తీసుకోవాలని వారు ఉచిత సలహా ఇస్తున్నారు.
ఇదిలావుండగా.. సగటున రోజుకి ఓ వ్యక్తి తీసుకోవాల్సిన ఉప్పు పరిమాణం 3.95 గ్రాములు వుండాలని వారు అంటున్నారు. అంతకుమించి ఎక్కువగా తీసుకుంటే చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కానీ.. భారత్ లో మాత్రం ఉప్ప పరిమాణం 7.6 గ్రాములుగా వున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆ పరిమాణాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలని.. లేకపోతే ఆ విషయం ఆందోళన కలిగించకమానదని వారు హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more