సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకంతో మెరిశాడు. 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో.. నాలుగో ఓవర్లోనే క్రీజ్లోకి అడుగుపెట్టిన మహీ.. రోహిత్ శర్మతో కలిసి ఓపికగా ఆడాడు. 93 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ధోనీ.. 68వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మహీ కెరీర్లో నెమ్మదిగా చేసిన రెండో అర్ధ శతకం ఇదే కావడం గమనార్హం. గత ఏడాది ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని మహీ.. ఈ ఏడాది తొలి ఆడిన తొలి వన్డేలోనే హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. 14 ఇన్నింగ్స్ విరామం తర్వాత ధోనీకి ఇది తొలి అర్ధ శతకం.
ఆచితూచి ఆడిన ధోనీ.. రోహిత్తో కలిసి నాలుగో వికెట్కు 137 పరుగులు జోడించాడు. పది పరుగుల్లోపు మూడు వికెట్లు కోల్పోయాక.. నాలుగో వికెట్కు నమోదైన రెండో అతిపెద్ద భాగస్వామ్యం ఇదే కావడం గమనార్హం. 1984లో ఆస్ట్రేలియా విండీస్పై 150 పరుగులు చేయడమే ఇప్పటి వరకూ అత్యుత్తమం.
భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో బెహ్రెన్డ్రాఫ్ బౌలింగ్లో ధోనీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంతి అవుట్ సైడ్ పిచ్ అయినా.. అదేమీ పట్టించుకోకుండానే అంపైర్ మైకెల్ గవుఫ్ అవుటిచ్చాడు. టీమిండియా అప్పటికే రెండు రివ్యూలను వృథా చేయడంతో.. మరోసారి డీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోయింది. దీంతో భారత్ కీలకమైన ధోనీ వికెట్ కోల్పోయింది. డీఆర్ఎస్ కోరడంలో కింగ్ అయిన ధోనీ.. నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది
India are out of reviews and Dhoni has to go... #CloseMatters#AUSvIND | @GilletteAU pic.twitter.com/WRYVQPxwIM
— cricket.com.au (@cricketcomau) January 12, 2019
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more