టీమిండియాతో జరుగుతోన్న చివరి టెస్టు.. తన అఖరి టెస్టు కావడంతో తనదైన శైలిలో ట్రేడ్ మార్క్ శతకంతో ఇంగ్లాండ్ ఆటగాడు కుక్ శతకం విడ్కోలు పలికాడు. 70వ ఓవర్లో విహారి వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న కుక్ ఆ బంతికి బౌండరీకి తరలించాడు. దీంతో కుక్ తన టెస్టు కెరీర్ లో 33వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఆఖరి టెస్టులో శతకం సాధించడంతో కుక్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. కుక్ సెంచరీ చేయగానే గ్యాలరీ నుంచి అతని కుటుంబసభ్యులతో పాటు అభిమానుల చప్పట్లతో స్టేడియం హోరెత్తింది.
ఈ సమయంలో కుక్ భావోద్వేగానికి గురయ్యాడు. బ్యాట్ ను గాల్లోకి లేపి కుక్ సంబరాలు చేసుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్ తో పాటు చివరి టెస్టులోనూ ప్రతి ఇన్నింగ్స్ లోనూ 50కి పైగా పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా కుక్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు 69 ఏళ్ల రికార్డును అందుకున్నాడు. 114/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థి జట్టును మన బౌలర్లు వీలైనంత త్వరగా ఆలౌట్ చేద్దామనుకుంటే ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు కుక్-రూట్ క్రీజులో పాతుకుపోయారు.
వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ, వికెట్ల మధ్య పరుగులు చేస్తూ వీరిద్దరూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్నారు. మరో పక్క ఈ జోడీని విడదీయలేక కోహ్లీ సేన నానా తంటాలు పడుతోంది. 71 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 232పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కుక్ (101), రూట్ (83) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 272 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more