శ్రీలంక పర్యటనలో భారత అతిథ్య జట్టును క్లీన్ స్వీప్ చేసి చరిత్రను తిరగరాసింది. గత 85 ఏళ్ల టీమిండియా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ సాధించని వైట్ వాస్ విజయాన్ని అందుకుంది. వీదేశీ పర్యటనలలో ఇప్పటి వరకు టీమిండియా జట్టు సాధించని టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ విజయాలను అందుకున్న జట్టుగా విరాట్ సేన సరికొత్త అద్యయాన్ని లిఖించింది. మూడు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టు.. శ్రీలంకను చివరి రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది.
అందుకు ముందు అడిన తొలి టెస్టులో కూడా ఫాలో-అన్ అడించే అవకాశమున్నా.. విరాట్ సేన అందుకు ప్రాధాన్యతను ఇవ్వకుండా సెకెండ్ ఇన్నింగ్స్ ను అడింది. లేని పక్షంలో ఈ సరికోత్త అద్యయం కూడా సరికొత్తగా మూడు టెస్టులలో ఇన్నింగ్స్ విక్టరీగా కోహ్లీ సేన నమోదు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. కాగా టెస్టు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న తరువాత వరుసగా ఎనమిదవ టెస్టు సిరీస్ ను కూడా విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్.. బౌలింగ్ సహా గ్రౌండ్ లో కూడా సమష్టిగా రాణించిన టీమిండియా పల్లెకలె వేదికగా జరిగిన మూడవ టెస్టులో ప్రత్యర్థి శ్రీలంకను మూడవ రోజునే చాపచుట్టేలా చేసింది. పల్లెకలే టెస్టులో ఇన్నింగ్స్ 171 పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇదిలావుండగా, ఆతిథ్య శ్రీలంక జట్టు వారి స్వదేశంలోనే వైట్ వాస్ కావడం ఇది రెండవ సారి. కాగా టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశానికి చెందిన జట్టు.. క్లీన్స్వీప్ కు గురికావడం ఇది ఏడోసారి. దీంతో టీమిండియా అరుదైన రికార్డులను బద్ధలు కొట్టినట్టైంది. అనుకోకుండా టెస్టు జట్టులో స్థానం సంపాదించిన శిఖర్ ధావన్.. ఈ సిరీస్ లో రెండు శతకాలను నమోదు చేసి.. అత్యధిక పరుగులు సాధించడంతో అతనికి మ్యాన్ అప్ ది సిరీస్ అవార్డును ప్రకటించారు. కాగా మూడవ టెస్టులో అన్ని విభాగాల్లో రాణించిన పాండ్యాకు మ్యాన్ అప్ ది మ్యాచ్ వరించింది.
మూడు టెస్టు సిరీస్ లో రెండు టెస్టులలో గెలిచి.. సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. మూడో టెస్టుతో భారత బౌలర్లు లంకేయులను నిలదోక్కుకోనీయలేదు. పదునైన బౌలింగ్తో వణికించారు. స్పిన్ తో తికమక పెడుతూనే.. పదునైన పేస్ తో బెంబేలెత్తించారు. దీంతో ఫాలోఆన్ లో ఓవర్నైట్ స్కోరు 19/1తో మూడో రోజు అటను ప్రారంభించిన లంకేయులు 181 పరుగులకే కుప్పకూలారు. నైట్ బ్యాట్స్ మన్ కరుణరత్నె (16)ను అశ్విన్ 26 పరుగుల వద్ద పెవీలియన్ కు పంపగా, పుష్ఫకుమార్ (1)ను ఉమేశ్, కుశాల్ మెండిస్ (12)ను షమి వెనువెంటనే వెనక్కు పంపారు. నాలుగు వికెట్లు నష్టంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ జట్టును సారథి దినేశ్ చండిమాల్ (36), ఏంజెలో మాథ్యూస్ (35) లు కాపాడుకుంటూ 65 పరుగులను జోడించారు.
చండిమాల్ ను ఔట్ చేసి కుల్దీప్ రెండో ఇన్నింగ్స్ లో మరో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మాథ్యూస్ ను అశ్విన్ ఎల్బీడబ్యూ చేయడంతో లంక పతనం మరింత వేగం పుంజుకొంది. పెరీరా (8), సండకాన్ (8) వెంటవెంటనే ఔట్ కావడం టీమిండియాకు కలిసోచ్చినా.. మ్యాచ్ చివర్లో డిక్వెలా (41) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయగా, అతడ్ని ఉమేశ్ పెవీలియన్ కు పంపాడు. లహిరు కుమార (10)ని అశ్విన్ బోల్తా కొట్టించడంతో లంక కథ ముగిసింది. అశ్విన్ (4/68), మహ్మద్ షమి (3/32), ఉమేశ్ యాదవ్ (2/1) కుల్దీప్ (1/56) బౌలింగ్లో రాణించారు. హార్దిక్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, శిఖర్ ధవన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more