ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రీలంకతో మ్యాచ్ లో పేలవ ప్రదర్శనపై అభిమానులు తీవ్ర నిరాశకు గురైన విషయం తెలిసిందే. విరాటే కాదు అంతకు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలర్స్ కూడా పాకిస్థాన్ చేతిలో డౌకౌట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీరిద్దరూ నేటితరం దిగ్గజ అటగాళ్లే. అయితే వీరు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఛాంఫియన్స్ ట్రోఫీలో ఘోరంగా నిరాశపర్చడానికి కారణం ఏంటా అన్న విషయమై అరా తీశారు క్రికెట్ అభిమానులు.
అసలే సెంటిమెంట్లకు అత్యంత ప్రాధాన్యత నిచ్చే క్రికెట్ లో.. వీరిద్దరూ ఒక వ్యక్తితో దిగిన సెల్పీలే వారి డౌకట్ కు, అంతేకాదు.. వారి జట్లు కూడా ఓటమిపాలవ్వడానికి కూడా కారణమన్న టాక్ ఇప్పుడు క్రికెట్ అభిమానులను కలవరపరుస్తుది. అదేంటి.. వారు డకౌట్ కావడానికి సెల్పీలు దిగడానికి కారణమేంటి అని కొందరు కొట్టిపారేస్తున్నా.. అదే నిజమని కూడా పలువురు బలంగా విశ్విసిస్తున్నారు. ఇంతకీ వారు ఎవరితో సెల్పీలు దిగారు.. అన్న అడుగుతున్నారు కదూ.. మరెవరో కాదండీ పాకిస్థాన్ కు చెందిన ఓ జర్నలిస్టుతో. అమె పేరు జైనాబ్ అబ్బాస్.
క్రికెటర్లతో సెల్ఫీ దిగిన పాపానికి అమె అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఆమెపై అకారణంగా విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్ స్పోర్ట్స్ రిపోర్టర్ జైనాబ్ అబ్బాస్.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్తో సెల్ఫీలు దిగడమే ఇందుకు కారణం. సెల్పీలు చూసుకొని ఆమె సంబరపడిపోయింది కానీ.. ఆవే ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆమెతో సెల్ఫీలకు పోజిచ్చిన ఇద్దరు బ్యాట్స్ మెన్లు డకౌట్ అయ్యారు. దీంతో జైనాబ్పై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more