వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇక అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరగనున్న టీ 20 మ్యాచ్ లపై దృష్టిసారించింది. టీ 20 మ్యాచ్ల్లో భాగంగా భారత-వెస్టిండీస్ క్రికెట్ జట్ల మధ్య జరిగే పోరుకు ఆతిథ్యమివ్వనున్న ఫ్లోరిడా రాష్ట్రంలోని సెంట్రల్ బ్రోవర్డ్ రీజినల్ పార్క్ స్టేడియం తనను ఎంతో ఆకట్టుకుందని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమోదం పొందిన ఇక్కడ స్టేడియంలోని వసతులను చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు కుంబ్లే తెలిపాడు.
అమెరికాలో క్రికెట్ ఆట స్థాయిని పెంచడానికి చేసే ఈ ప్రయత్నం నిజంగానే సరికొత్త ఆరంభంగా అభివర్ణించాడు. ఈ రెండు మ్యాచ్ల టీ 20 సిరీస్తో అమెరికాలో క్రికెట్పై ఆదరణ పెరుగుతుందని కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. ఈ తరహాలో స్టేడియం వసతులు ఏర్పాటు చేస్తారని తాను అసలు ఊహించలేదన్నాడు. యూఎస్లో ఇంత ఘనంగా మ్యాచ్లు జరపడానికి నడుంబిగించడం ఖచ్చితంగా అక్కడ వచ్చిన మార్పుకు నాందిపలుకుతుందని కుంబ్లే ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఫ్లోరిడాలోని గ్రౌండ్ బాగుంటుందని గతంలోనే విన్నా. అయితే ఈరోజు కళ్లతో చూసి ఆశ్చర్యానికి లోనయ్యా. నేను ఊహించిన దానికంటే ఇక్కడ వసతులు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ గ్రౌండ్ను, ఇక్కడి వికెట్ను చూడటం ఇదే మొదటిసారి. అవుట్ ఫీల్డ్ కూడా బాగుంది. యూఎస్లో భారత్ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం ఇదే తొలిసారి. ఇక్కడ క్రికెట్ పై ఆదరణ పెంచాలనే ఐసీసీ చేసే ప్రయత్నం త్వరలోనే నెరవేరుతుంది' అని కుంబ్లే తెలిపాడు. శని, ఆదివారాల్లో విండీస్తో టి20 మ్యాచ్లు జరుగనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more