కొలంబో వేదికగా అథిత్య జట్టు శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజున భారత్ దూకుడుగా ముందుకు సాగుతోంది. తొలి టెస్టును తమ చేతుల్లోంచి చివరి రోజున లాక్కున్న లంకేయులకు మళ్లీ అదే చివరి రోజు ముహూర్తం రానే వచ్చింది. రెండో టెస్టులో టీమిండియా విజయానికి కేవలం 8 వికెట్ల దూరంలో వుండగా, అదే చివరి రోజు ఎవరికి అదృష్టాన్ని వర్తింపజేస్తుందోనన్న ఉత్కంఠ రెండు జట్ల అభిమానుల్లో నెలకోంది. ఇదే టెస్టును మళ్లీ లంకేయులు గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలంటే ఇంకా 342 పరుగులు చేయాల్సి వుంది.
తొలి ఇన్నింగ్స్ లో లంకపై.. 87 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన కోహ్లీ సేన.. రెండో ఇన్నింగ్స్ లో ఎనమిది వికెట్ల నష్టానికి 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో లంక ముందు 413 పరుగులు విజయాలక్ష్యాన్ని నిర్ధేశించింది. పరుగుల వేటను సాగించిన లంక అదిలోనే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. కరుణరత్నే (25 బ్యాటింగ్), మాథ్యూస్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కౌశల్ సిల్వా ఒక్క పరుగుకే పెవిలియన్ చేరగా, వెటరన్ సంగక్కర తన చివరి ఇన్నింగ్స్లో 18 పరుగులకు అవుటయ్యాడు. భారత్ బౌలర్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు వికెట్ నష్టంతో 72 పరుగులు సాధించిన టీమిండియా ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. అజింక్యా రహానె (126) సెంచరీ సాయంతో రెండో ఇన్నింగ్స్ను 325/8 వద్ద డిక్లేర్ చేసింది. మురళీ విజయ్ (82) హాఫ్ సెంచరీకి తోడు రోహిత్ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్లు కౌశల్, దమ్మిక ప్రసాద్ చెరో 4 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 393, లంక 306 పరుగులు చేసింది
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more