కొలంబో వేదికగా అథిత్య జట్టు శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి.. భారత్ భారీ అధిక్యం దిశగా స్కోరు బోర్డును పరుగులెత్తిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో లంకపై.. కోహ్లీ సేన 87 పరుగుల ఆధిక్యం సాధించింది. లంకేయులు తొలి ఇన్నింగ్స్ లో 306 పరుగులకు అలౌట్ అయిన తరువాత రెండో ఇన్నింగ్స్ అరంభించిన టీమిండియాకు మొదటి ఓవర్ లో చుక్కెదురైంది. తొలి ఇన్నింగ్స్ లో శతకంతో రాణించిన లోకేష్ రాహుల్.. కేవలం రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటై పెవీలియన్ చేశారు. మరో ఓపెనర్ మురళీ విజయ్ తో జతకట్టిన అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు పరుగెత్తించాడు. ఇద్దరి మధ్య 67 పరుగులు భాగ్యస్వామ్యం నెలకొంది. మూడో రోజు అఠ ముగిసే సమాయానికి టీమిండియా వికెట్ నష్టానికి 70 పరుగులు సాధించింది. దీంతో మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ అధిక్యాన్ని కలుపుకుని భారత్ 157 పరుగుల అధిక్యంతో కొనసాగుతోంది. ఆట ముగిసే సమయానికి మురళీ విజయ్ రెండు పోర్లతో 39 పరుగుల వద్ద కోనసాగుతుండగా, అజింక్యా రహానే ఒక్క పోరు సహాయంతో 28 పరుగుల వద్ద కోనసాగుతున్నాడు.
అంతకుముందు లంకేయులు 306 పరుగులకు ఆలౌటయ్యారు. మాథ్యూస్ (102) సెంచరీ, తిరుమన్నె (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరి మినహా ఇతర బ్యాట్స్మెన్లను భారత భౌలర్లు వికెట్ల వద్ద సెటిల్ కాకుండానే వెనువెంటనే పెవీలియన్ దారి పట్టించారు. భారత బౌలర్లు అమిత్ మిశ్రా 4, ఇషాంత్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు భారత్ తొలిఇన్నింగ్స్ లో 394 పరుగులకు అటౌట్ అయ్యింది. మూడు వికెట్ల నష్టానికి 140 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు టీ విరామానికి 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు. లంక ఓవర్నైట్ బ్యాట్స్మెన్ మాథ్యూస్, తిరుమన్నె నాలుగో వికెట్కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి సెషన్లో విఫలమైన భారత బౌలర్లు లంచ్ విరామం తర్వాత విజృంభించారు. వెంటవెంటనే నాలుగు వికెట్లు పడగొట్టి లంకను కట్టడి చేశారు. భారత పేసర్ ఇషాంత్.. తిరుమన్నెను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఇషాంత్.. చండీమల్ (11)ను పెవిలియన్ చేర్చాడు. సెంచరీ హీరో మాథ్యూస్తో పాటు దమ్మిక ప్రసాద్ (5) వెంటవెంటనే అవుటయ్యారు. టీ విరామం తర్వాత లంక మిగిలిన మూడు వికెట్లూ కోల్పోయింది. మొత్తానికి 108 ఓవర్ల అఢిన లంకేయులు 306 పరుగల వద్ద అలౌట్ అయ్యారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more