టీమిండియా బంగ్లాదేశ్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్కి వరుణుడు వరుసగా అంతరాయం కలిగిస్తున్నాడు. రెండో రోజు పూర్తిగా వరుణుడు అడ్డంకిగా నిలువగా, ఇవాళ కూడా అదే పరిస్థితి ఏర్పడటంతో మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంఫైర్లు ప్రకటించారు. 103.3 ఓవర్లకు గాను టీమిండియా 6 వికెట్లను నష్టపోయి 462 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తున్నప్పటికీ.. ఈ మ్యాచ్ ఫలితం తేలుతుందన్న విషయంలో మాత్రం మిమాంస ఏర్పడింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి రవిచంద్రన్ అశ్విన్ 2, హార్భజన్ సింగ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోజంతా వర్షానికి తడిసి తేమతో నిండిన ఢాకా పిచ్ స్పిన్నర్లకు మంచి సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ ఒక్క రోజులోనే భారత్ ఆరు విక్కెట్లను కోల్పోయింది. ఇవాళ ఉదయం భారత్ స్కోరు 283 పరుగుల వద్ద వుండగా, 173 పరుగుల వ్యక్తిగత స్కోరుతో డబుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న ఓపెనర్ శిఖర్ ధావన్ రూపంలో తొలి విక్కెట్ బంగ్లాకు లభించింది.
అ తరువాత వచ్చిన రోహిత్ శర్మ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకీబ్ హసన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు, అ తరువాత వచ్చిన జట్టు సారధి విరాట్ కోహ్ల ీకూడా 14 పరుగుల స్కోరు వద్ద వెనుదిరిగాడు. కాగా ధాటికి ఆడుతున్న భారత్ బ్యాట్స్మెన్ అజ్యంకె రహానే షకీబ్ అల్ హసన్ 98 పరుగుల వద్ద ఔట్ చేయగా, పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన వర్ధమాన్ సాహా 6 పరుగులకే జుబేర్ హుస్సేన్ ఔట్ చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ నాలుగు వికెట్లు తీసుకోగా, జుబేర్ హుస్సేన్ రెండు వికెట్లు తీసుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more