హిందువులు ఎంతో భక్తిశ్రద్ధులతో, ఆధ్మాత్మికంగా నిర్వహించుకునే పండుగలలో ‘‘హనుమాన్ జయంతి’’ కూడా ఎంతో ముఖ్యమైంది. ఈ పర్వదినం సందర్భంగా ప్రతిఒక్కరు ఆలయాలకు వెళ్లి హనుమంతునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనేక దేవాలయాల్లో ఈరోజున అన్నదానాలు నిర్వహిస్తారు. కొందరు ఈవేళ ఉపవాసం వుండడానికి చాలా ఇష్టపడతారు.
ఆంజనేయస్వామి ధైర్యానికి, శక్తిసామర్థ్యాలకు ప్రతిరూపం. సీతమ్మ జాడను తెలుసుకోవడం కోసం.. సముద్రాన్ని దాటి, ఆకాశమార్గంలో పయనించి లంకకు చేరుకున్నాడు. అంతేకాదు.. సంజీవని పర్వతాన్నే పెలికించి తీసుకొచ్చిన హనుమంతుడి శక్తులను లెక్కించడం, కీర్తించడం అసాధ్యం. హనుమంతుడు ఎంతో బలవంతుడు అయినప్పటికీ రాముడి సేవ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపించాడు. ఆంజనేయునికి శ్రీరాముడ్ని ఎంత భక్తిగా ఆరాధిస్తాడంటే.. ఏకంగా మన మనసునే మందిరంగా చేసి ఆరాధించేవాడు.
సాధారణంగా హనుమాన్ జయంతిని చైత్ర పౌర్ణమినాడు చేసుకుంటారు. తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణమిరోజు, మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకుంటారు. దీని ప్రకారం.. హనుమాన్ జయంతి సంవత్సరంలో మూడుసార్లు జరుపుకుంటారు.
అంజనాదేవి, కేసరిల సుపుత్రుడే హనుమంతుడు. వాయుదేవునికి ఔరస పుత్రుడు. ఏకాదశ 11 రుద్రులలో శ్రీ ఆంజనేయస్వామి ఒకరు. సప్త చిరంజీవులలో ఒకరు. పరమశివుని అంశతో ఈయన జన్మించారు. భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెబితేనే భయపడి పారిపోతాయి. మానువునిలో వున్న మహారోగాలు నయమయిపోతాయి. బుద్ధి, బలం పెరగడంతోపాటు.. శని బాధలు కూడా తొలగిపోతాయి.
రాముని మీద హనుమంతుని భక్తి :
పూర్వం ఒకనాడు సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకోవడం చూసి హనుమంతుడు.. ‘‘అమ్మా! నువ్వు నుదుటను సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావు?’’ అని ప్రశ్నించాడు. అప్పుడు సీతమ్మ నవ్వుతూ.. ‘‘శ్రీరామునికి ఎటువంటి ఆపదలు రాకుండా దీర్ఘాయుష్కుడిగా వుండాలని పెట్టుకుంటున్నాను’’ అని సమాధానం చెబుతుంది. ఆ మరుక్షణమే హనుమంతుడు ఒక్క క్షణం ఆలోచించకుండా తన ఒళ్లంతా సింధూరం పోసుకుంటాడు.
మరొక కథ :
ఒక సందర్భంలో సీత, హనుమంతునికి ఒక రత్నాభరణాన్ని బహూకరిస్తుంది. దానిని తీసుకున్న హనుమంతుడు ఆ ఆభరణంలో వున్న ఒక్కో పూసను కొరికి, చూసి, విసిరిపారేసేవాడు. ‘‘అదేమిటి? అలా విసిరేస్తున్నావు?’’ అని సీత అడగగా.. హనుమంతుడు.. ‘‘రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనన్న ఆశతో చూశాను. కానీ కనిపించలేదు. నా స్వామి లేని రత్నాలు నాకేం పనికొస్తాయి?’’ అని సమాధానం ఇచ్చాడు.
అంతటి నిరూపమైన శక్తిని శ్రీ ఆంజనేయుడు, రాముని మీద కలిగి వున్నాడు.
మరికొన్ని విశేషాలు :
హనుమంతుడికి 5వ సంఖ్య అంటే ఎంతో ఇష్టం. అలాగే అరటిపళ్లు, మామిడి పళ్లంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు కూడా హనుమాన్ జయంతి సందర్భంగా 5 ప్రదక్షిణలు, 5 మామిడి - అరటి పళ్లను సమర్పించండి. అలాగే 5 సార్లు లేదా వీలుంటే మీకు నచ్చినసార్లు హనుమాన్ పారాయణం చేయండి. ఇలా చేయడం ద్వారా ఇళ్లలో శుభకార్యాలు, నిర్వహించుకున్న పనులు, కోరికలు నెరవేరుతాయి. సంతానం లేనివారికి సంతానప్రాప్తి సిద్ధిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more
Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more
Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more
Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more
Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more