‘ఉయ్యాల జంపాలా’ చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు రాజ్ తరుణ్... ప్రస్తుతం మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా రాజ్ తరుణ్ నటించిన ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం కూడా విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మంచి టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ ఓ పెద్ద దర్శకుడి సినిమాలో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో రాజ్ తరుణ్ ను హీరోగా ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది.
ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం సుకుమార్ నిర్మిస్తున్న ‘కుమారి 21F’ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more