ఢిల్లీలో జరుగుతున్న పరిస్థితుల పై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే సీమాంద్ర నాయకులు మాత్రం ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీమాంద్ర నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గతంలో విడిపోయిన విషయం తెలిసిందే. తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర నాయకులు ఢిల్లీలో ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర పర్యాటశాఖ మంత్రి చిరంజీవి ఎటు వైపు అనే విషయం పై కాంగ్రెస్ నాయకులు మద్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రం విడిపోనుందనే వార్తలతో మంత్రి చిరంజీవి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసినట్లు ఢిల్లీ లో మీడియా కోడై కూస్తుంది. అయితే చిరంజీవి ప్రధాని మంత్రి రాష్ట్రం గురించి ఎం చెప్పారు? రాష్ట్ర విభజన జరగాలని చెప్పారా? లేక రాష్ట్రం సమైక్యాంగా ఉంచాలని చెప్పారా? అనే విషయం చర్చలు కాంగ్రెస్ నాయకులు మద్య బలంగా జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రం సమైక్యంగా ఉంటే కలిగే ప్రయోజనాలు , ఒక వేళ విడిపోతే అవి సమస్యలుగా మారతాయని, వివిద అంశాలపై ప్రధానికి తెలిపినట్లు సీమాంద్ర నాయకులు అంటున్నారు. అయితే చిరంజీవి చెప్పిన విషయాలను, సూచనలు ఆచరణయోగ్యంగా ప్రజలకు మేలుకలిగేలా ఉన్నాయని ఢిల్లీ పెద్దలు సీమాంధ్ర నాయకులతో చెప్పినట్లు సమాచారం. కానీ చిరంజీవి చెప్పిన విషయాలు కాంగ్రెస్ హైకమాండ్ ఆచరణకు ఏమాత్రం నోచుకుంటాయనేది ఒక ప్రశ్నార్థకమే ? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ పై ఒక స్పష్టమైన నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మ ఆ నిర్ణయానికి ఇంక ముహూర్తం పెట్టలేదు. ఇదే సీమాంద్ర నాయకులు కనిపించిన బలం అని అంటున్నారు. అయితే మంత్రి చిరంజీవి మాత్రం ఎటువైపు బలంగా ఉన్నరనేది ఢిల్లీ పెద్దలకే అర్థకాలేదనే మాటలు ఢిల్లీ ఏపీ భవన్ లో వినిపిస్తున్నాయాని మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more