తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో మామ చెప్పే మాటలకు .. మేనల్లుడు చేసే పనులకు చాలా తేడా ఉందని గులాబీ గుర్తించారు. మామ మాయ మాటలకు పడిపోయిన నాయకులు గులాబీ హామీలు గంపగుత్తగా ఇస్తున్నాడు అయితే మేనల్లూడు ఆయన హామీలకు గండి కొట్టే పనిలో బిజీ బీజీగా ఉన్నట్లు టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. ఇటీవల పసుపు చొక్క విప్పి.. గులాబీ కండువా కప్పుకున్న కడియం శ్రీహరికి టీఆర్ఎస్ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు, రాబోయో తెలంగాణకు కడియం శ్రీహరే ముఖ్యమంత్రి అన్నట్లు గా ప్రకటనలతో శ్రీహారికి గులాభీషేకం చేయటం జరిగింది. మామ చేసిన పనికి మేనల్లూడు హరీశ్ రావుకు నచ్చటలేదని ఆయన వర్గీయులు అంటున్నారు.
దీనికి నిదర్శనం రీసెంట్ పార్టీ స్సెసెండ్ కు గురైన రఘనందన్ రావు ఎమ్మెల్యే హరీశ్ రావు మీద చేసిన ఆరోపణలకు కేసిఆర్ మౌనం వహించటమే కారణమని తెలుస్తోంది. కడియం శ్రీహరిని దెబ్బతీసేందుకు హరిశ్ రావు కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో పార్టీ పరంగా శత్రువులైన వారినే రంగంలోకి దించుతున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి. కడియం శ్రీహరి పై కాంగ్రెస్ ఎంపీ రాజయ్యను రెచ్చగొట్టే విధంగా హరిశ్ రావు పావులు కదుపుతున్నాట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ సభ్యుడు రాజయ్య ప్రస్తుతం తెలంగాణ రాష్ర్ట సమితిలో చేరేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు. అదే స్థానాన్ని ఆశించి అంతకు ముందు టీడీపీ నుంచి కడియం శ్రీహరి ఆయన కన్నా ముందే టీఆర్ఎస్లో చేరిపోయారు. వాస్తవానికి కడియం వరంగల్ జిల్లా స్టేషన్ఘన్పూర్ నుంచి అనేక సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. గత ఎన్నికల్లో ఆయనను కాంగ్రెస్పార్టీ తరఫున రాజయ్య ఓడించి శాసన సభకు వచ్చారు.
తిరిగి ఆయనే రాజీనామా చేసి మరోసారి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. రాజయ్య అటు కాంగ్రెస్ క్యాడర్ను, ఇటు టీఆర్ఎస్ క్యాడర్ను తమ వైపు తిపకోగలిగారు. నిన్నటి వరకు రాజయ్యను టీఆర్ఎస్ను, కాంగ్రెస్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కడియం ఈ రోజు రాజయ్య పక్కనే నవ్వుతూ కెమెరాలకు ఫోజులిచ్చినా ఏళ్ళ తరబడి వారి మధ్య ఉన్న శత్రుత్వం ఒక్క రోజులోనో, ఒక్క వారంలోనో, ఒక నెలలోనో పోయేది కాదు. అదే సమయంలో కడియం శ్రీహరిని పార్లమెంటుకు పంపుతామని పరోక్షంగా వ్యాఖ్యానించిన కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని ఒదిలి కేవలం వరంగల్ పార్లమెంటు స్థానం కోసమే టీఆర్ఎస్లోకి చేరుతున్న ఎంపీ రాజయ్యకు ఏ విధంగా పార్లీమెంటు టికెట్ ఇస్తారో అర్థం కాక కేసీఆర్ కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు.
రాజయ్యను హరీష్రావు టీఆర్ఎస్లోకి తీసుకురావడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. కడియం శ్రీహరితో దశాబ్దకాలంగా ఉన్న వ్యక్తిగత శత్రుత్వం వల్లే ఎలాగైనా ఆయనను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ రాజయ్యను టీఆర్ఎస్లోకి తీసుకొచ్చి ఆయనను వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇప్పించి కడియంను దెబ్బతియ్యాలని హరీష్రావు ప్రయత్నం చేస్తున్నారంటూ పార్టీలో ప్రచారం జరుగుతోంది. అంటే రాబోయో తెలంగాణకు మఖ్యమంత్రి కడియం శ్రీహరి కాదట.. రాజయ్యనేనని టీఆర్ఎస్ కార్యకర్తలు చెవులు కొరుకుంటున్నారు. ఈ ఇద్దరు ఒకే వర్గానికి చెందినవారు కావటమే హరిష్ రావు బాగా కలిసి వచ్చిందని పార్టీలో సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. చివరకు హారీష్ రావు ఎవరి చెవిలో గులాబీ పెడతాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more