దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గా ఉండి రాజశేఖర రెడ్డి మంచి సన్నిహితంగా ఉండేవాడట. అదీగాక ఇద్దరిది పేరు చివర రెడ్డి రావటంతో అభిమానం ఎక్కువగా ఉండేదట. అప్పటి నుండి వైఎస్ కుటుంబం అంటే కిరణ్ చాలా ఇష్టమాట. అందులోను జగన్ అంటే మరీ మరీ అభిమానం మాట. అయితే వైఎస్ చనిపోయిన తరువాత సీఎం రేసులో ఎవరు ఉన్నారంటే .. కొంతమంది జగన్ పేరును చూపించారు. మరికొందరు సైలెంట్ గా ఉన్నారట. కానీ కిరణ్ మాత్రం జగన్ కంటే నేనే సీఎం అయితే బాగుంటుందని మనస్సులో అనేక సార్లు అనుకున్నాడట.
కానీ అధిష్టానం .. ఆలోచించి జగన్ సీఎం పదవి ఇస్తే .. రాష్ట్రంలో ఉన్న పార్టీ సీనియర్ నాయుకులు దూరం అవుతారని భావించి .. అపర చాణుక్యుడైన కొణిజేటి రోశయ్యకు సీఎం పదవిని కట్టబెట్టింది. జగన్ అధిష్టానం మీద కొపంతో తన సీఎం కూర్చి ఇవ్వకంటా.. ముసలివాడైన రోశయ్యకు ఇచ్చారని పార్టీకి వ్యతిరేకంగా బయటికి వచ్చి వైఎస్ఆర్ పార్టీ .. కాంగ్రెస్ మీద యుద్దాని సై అంటున్నారు. రోశయ్య సీఎం అయిన తరువాత రాష్ట్రంలో .. పరిస్థితులు చాలా ఘోరంగా మారిపోయినాయి. కొత్త సమస్యలతో రాష్ట్రం అతలకుతలమైపోయింది. రాష్ట్రం ఇలా ఉండటం చూసిన కాంగ్రెస్ వెంటనే రోశయ్యను దించి .. నల్లారి కిరణ్ కుమార్ ను సీఎం సీటు ఇచ్చింది. అండ దారిలో సీఎం పదవి తెచ్చుకున్న కిరణ్ తన బందు ప్రీతీ చూపటం మొదలు పెట్టడట. తన వర్గానికి మంత్రి పదవులు ఇవ్వటం, మిగతావారిని కొంచెం దూరంగా పెట్టడం జరుగుతుందట. అలాంటి వారిలో దళిత మంత్రి శంకర్రరావు ఒక్కడు. అప్పటి నుండి కిరణ్ జగన్ పట్ల సోదర భావం చూపుతూ .. జగన్ కు అండగా ఉన్నడని మంత్రి శంకర్రరావు అంటున్నరు.
జగన్పై మంత్రివర్గంలోని ఇతర మంత్రులెవ్వరూ మాట్లాడకుండా మీరొక్కరే ఎందుకు మాట్లాడుతున్నారని స్వయాన ముఖ్యమంత్రే నన్ను పలుమార్లు అడిగారని ఔళి, చేనేత శాఖా మంత్రి డా పి. శంకర్రావు చెబుతున్నారు. ముఖ్యమంత్రికి జగన్తో బంధుత్వం వుండటం మూలంగానే, ఒకే సామాజికవర్గం అయినందునే ఆయన అలా అడిగారని మంత్రి అంటున్నారు. మంత్రివర్గం నుంచి తనను తొలగిస్తున్నట్లు అధికారికంగా సమాచారం అందలేదని, ఒకవేళ తొలగిస్తే ప్రజలే అంతిమతీర్పునిస్తారని ఆయన అంటున్నారు.
ఇంతకాలం మంత్రిగా వున్నాను కాబట్టే బంధనాలున్నాయని, ఇక ఎమ్మెల్యేగా ఎలాంటి అడ్డంకులు లేనందున అతి త్వరలోనే ఎ టు జడ్ అందరి బండారాలు బయటపెడతానని, సీఎం సహా అందరి అవినీతిపై పోరాటం చేస్తానని శంకర్రరావు చెప్పాటం విశేషంగా ఉందట. ఉప ఎన్నికల తరువాత కిరణ్ సర్కార్ ఉంటుందో పోతుందో తేలుతుందని శంకర్రావు జోష్యం చెబుతున్నరట. నేను కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడుగా కొనసాగుతూ ఏడుసార్లు శాసన సభ్యుడుగా గెలిచిన చరిత్ర వుందని, ఏనాడూ అధిష్టానానికి వ్యతిరేకంగా పని చేయలేదని, ఒకవేళ అధిష్టానం తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తానని ఆయన చెబుతున్నారట. పౌరునిగా, ఎమ్మెల్యేగా వుంటూ కాంగ్రెస్ అధిష్టానానికి నిమ్మిన బంటుగా వుంటూ రాష్ట్రాన్ని లూటీ చేసినవారి గుండెల్లో నిద్రపోతానని ఆయన హెచ్చరిస్తున్నారట. సీఎం తనపై జరిగిన దాడిని ఖండించలేదని, అంతపాపం ఏం చేశామని, అవినీతిపై పోరాడటం నేను చేసిన తప్పా అని ఆయన అందరి అడగటం ఆశ్చర్యంగా ఉందట.
జగన్ కు కిరణ్ కు సంబంధం ఉందా లేదా అనేది 2014లో తెలిసిపోతుందని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అధిష్టానం రెడ్డి వర్గానికే అధికారం కట్టబెట్టడం జరిగిందట. ఇప్పడు ఉన్న రాజకీయలాను చూస్తుంటే .. కాంగ్రెస్ లో రెడ్డి వర్గంతో పాటు కాపు వర్గం కూడా బలపడుందని రుజువు అవుతుంది. ఎలా మొన్నటి వరకు మంత్రి వర్గం లో ముగ్గురే కాపులు ఉండే వారు. నిన్న కొత్తగా మరో ఇద్దరు కాపు వర్గం వారు చేరటంతో... రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తన 100 ఏళ్ల చర్చితను తిరగ రాయనుందని అంటున్నారు. అంటే 2014లో కాపు వర్గానికి బలం ఇచ్చే విధంగా అధిష్టానం ఉందట. అదే కనుక జరిగితే .. అప్పటు కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి వర్గం జగన్ వైపు చూడటం ఖాయమాని మంత్రి శంకర్రరావు అంటున్నారు. అలా చూసే వారిలో కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముందు ఉంటాని శంకర్రరావు మరొక సారి గుర్తు చేశారట.
అయితే 2014లో పి శంకర్రరావు జోస్యం నిజమవుతుందో లేదో చూద్దాం?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more